Israel-Iran: మళ్లీ వార్నింగ్లు.. బెదిరింపులు ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామన్న ఇజ్రాయెల్
- మళ్లీ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్నింగ్లు
- బెదిరింపులు ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామన్న ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఇరాన్ను మరోసారి ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరించింది. యూదు రాజ్యాన్ని ఇరాన్ బెదిరించడం కొనసాగిస్తే.. మళ్లీ టెహ్రాన్పై దాడి చేయడమే కాకుండా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన రామన్ వైమానిక స్థావరాన్ని కాట్జ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.
‘‘నేను నియంత ఖమేనీకి స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇజ్రాయెల్ను బెదిరించడం కొనసాగిస్తే.. మా చేయి మళ్లీ టెహ్రాన్కు చేరుకుంటుంది. మరింత ఎక్కువ శక్తితో.. ఈసారి మీకు వ్యక్తిగతంగా నష్టం జరగొచ్చు.’’ అని కాట్జ్ వ్యాఖ్యానించారు.
Also Read
ఇది కూడా చదవండి: Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?
ఇటీవలి ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. ఆ సమయంలో ఇరాన్ సైనిక, అణు ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ రైజింగ్ లయన్లో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ సిబ్బంది పాత్రను కాట్జ్ ప్రశంసించారు. ఇరానియన్ ఆక్టోపస్ తలపై పదేపదే దాడి చేశారని.. వినాశన బెదిరింపులను తొలగించారని కాట్జ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sofiya Qureshi: విజయ్ షాకు ఊరట.. సోఫియా ఖురేషి కేసులో సుప్రీంకోర్టులో ఉపశమనం
ఇటీవల ఖమేనీ.. ఇజ్రాయెల్ను బెదిరించారు. ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఇప్పటి కంటే ఎక్కువ దాడి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. భారీ దాడికి సిద్ధంగా ఉన్నట్లు ఖమేనీ పేర్కొన్నారు. తాజాగా ఖమేనీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కౌంటర్ ఎటాక్ చేశారు. బెదిరింపులు మానుకోకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమేనీని హెచ్చరించారు.
జూన్ 13న ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. అనంతరం అమెరికా కూడా దాడులు చేసింది. అనంతరం ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అధికారుల ప్రకారం 1,060 మంది మరణించారు. వీరిలో సీనియర్ ఇరాన్ సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు, పౌరులు ఉన్నారు. ఇక ఇజ్రాయెల్లో కనీసం 28 మంది మరణించారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!