Israel-Iran: మళ్లీ వార్నింగ్లు.. బెదిరింపులు ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామన్న ఇజ్రాయెల్
- మళ్లీ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్నింగ్లు
- బెదిరింపులు ఆపకపోతే ఖమేనీ అంతు చూస్తామన్న ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఇరాన్ను మరోసారి ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరించింది. యూదు రాజ్యాన్ని ఇరాన్ బెదిరించడం కొనసాగిస్తే.. మళ్లీ టెహ్రాన్పై దాడి చేయడమే కాకుండా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన రామన్ వైమానిక స్థావరాన్ని కాట్జ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.
‘‘నేను నియంత ఖమేనీకి స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇజ్రాయెల్ను బెదిరించడం కొనసాగిస్తే.. మా చేయి మళ్లీ టెహ్రాన్కు చేరుకుంటుంది. మరింత ఎక్కువ శక్తితో.. ఈసారి మీకు వ్యక్తిగతంగా నష్టం జరగొచ్చు.’’ అని కాట్జ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
ఇది కూడా చదవండి: Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?
ఇటీవలి ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. ఆ సమయంలో ఇరాన్ సైనిక, అణు ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ రైజింగ్ లయన్లో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ సిబ్బంది పాత్రను కాట్జ్ ప్రశంసించారు. ఇరానియన్ ఆక్టోపస్ తలపై పదేపదే దాడి చేశారని.. వినాశన బెదిరింపులను తొలగించారని కాట్జ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sofiya Qureshi: విజయ్ షాకు ఊరట.. సోఫియా ఖురేషి కేసులో సుప్రీంకోర్టులో ఉపశమనం
ఇటీవల ఖమేనీ.. ఇజ్రాయెల్ను బెదిరించారు. ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ను హెచ్చరించారు. ఇప్పటి కంటే ఎక్కువ దాడి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. భారీ దాడికి సిద్ధంగా ఉన్నట్లు ఖమేనీ పేర్కొన్నారు. తాజాగా ఖమేనీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కౌంటర్ ఎటాక్ చేశారు. బెదిరింపులు మానుకోకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమేనీని హెచ్చరించారు.
జూన్ 13న ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. అనంతరం అమెరికా కూడా దాడులు చేసింది. అనంతరం ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అధికారుల ప్రకారం 1,060 మంది మరణించారు. వీరిలో సీనియర్ ఇరాన్ సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు, పౌరులు ఉన్నారు. ఇక ఇజ్రాయెల్లో కనీసం 28 మంది మరణించారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
తాజావార్తలు
-
June 2026 Movie Releases: ‘పెద్ది’ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఇవే..
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!