Israel: అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్, డాక్టర్లను అరెస్ట్ చేసిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతంలోని అల్-షిఫా ఆస్పత్రి హాట్స్పాట్గా మారింది. ఈ ఆస్పత్రినే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్గా, ఆయుధాలు దాచేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆధారాలతో బయటపెట్టింది. ఆస్పత్రి కింద టన్నెల్స్, ఇతర ఏర్పాట్లను గుర్తించింది. ఇదే కాకుండా గాజాలోని పలు ఆస్పత్రుల కింద ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయని ఇజ్రాయిల్ పేర్కొంది.
ఇదిలా ఉంటే అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్తో పాటు ఇతర డాక్టర్లను ఇజ్రాయిల్ దళాలు గురువారం అరెస్ట్ చేశాయి. డైరెక్టర్ మొహమ్మద్ అబు సాల్మియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇతను అల్-షిఫా ఆస్పత్రి పరిణామాలు, ఇజ్రాయిల్ దాడుల గురించి తరుచుగా ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడిస్తుండే వాడు. ఇజ్రాయిల్ భూతల దాడులు ప్రారంభించనప్పటి నుంచి ఈ ఆస్పత్రిపై వరసగా దాడులు నిర్వహించింది.
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
Read Also: CM KCR: అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం కొత్త ఐటీ పార్క్..
ఈ ఆస్పత్రిలోని చాలా ప్రాంతాల్లో హమాస్ కార్యకలాపాలను ఇజ్రాయిల్ గుర్తించింది. అయితే దీన్ని హమాస్ ఉగ్రవాదులు ఖండించారు. డాక్టర్ మహ్మద్ అబు సాల్మియాతో పాటు మరికొందరు సీనియర్ వైదుల్ని అరెస్ట్ చేసినట్లు ఆస్పత్రి విభాగం చీఫ్ ఖలీద్ అబు సమ్రా కూడా ధృవీకరించారు.వ వీరిని అరెస్ట్ చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. రెడ్ క్రాస్, ఇతర సంస్థలకు వీరి విడుదల గురించి పిలుపునిచ్చింది. ఈ ఆస్పత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా మంది రోగులు కాలినడకనే దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు.
అక్టోబర్ 7న జరిగిన దాడిలో హమాస్ ఇజ్రాయిల్ లోని 1200 మంది చంపేసింది. దీంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేలకు మించి ప్రజలు చనిపోయారు. వీరిలో చాలా మంది పిల్లలు కూడా ఉండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!