ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: టీవీకే గూటికి అన్నాడీఎంకే బహిష్క్రత నేత సెంగోట్టయన్.. విజయ్ సమక్షంలో చేరిక
ఇంకోవైపు సెన్యార్ తుఫాన్ కారణంగా ఆకస్మిక వరదలు కూడా ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆకస్మిక వరదలు కారణంగా ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని ఉత్తర తపనులి దగ్గర వంతెన ధ్వజమైంది. ఇప్పటి వరకు 28 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక రోడ్లు ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ కూడా దెబ్బతింది. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
