విద్యార్ధులపై సెలవుల ప్రభావం.. వరల్ బ్యాంక్ నిపుణుడి ఆందోళన
కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు.
అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్ జేమీ సావెద్రా కొత్త వేరియంట్లు వస్తే తప్పని పరిస్థితుల్లో మాత్రమే చివరి నిర్ణయంగా స్కూళ్లను మూసివేయాలని సూచించారు.
Also Read
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
పాఠశాలలు సురక్షితం కాదని, తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవని సావెద్రా అన్నారు. బడులు తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పిల్లలకు టీకాలు వేసేంతవరకు వేచి ఉండటం సమంజసం కాదని, దాని వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదని ఆయన స్పష్టం చేశారు.
బార్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లను తెరిచి.. కేవలం స్కూళ్లను మూసివేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. బడులను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని పలు అధ్యయనాల్లో తేలిందని… కరోనా ప్రభావం పిల్లలపై తక్కువే అన్నారు సావెద్రా.
2020కు సంబంధించి ప్రపంచ బ్యాంకు విద్యా విభాగంఓ నివేదికను రూపొందించింది. ఒక దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మించి నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. స్కూళ్ల మూసివేత కారణంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సావెద్రా హెచ్చరించారు. పాఠశాలలు తెరవడం వల్లే కేసులేమైనా పెరిగాయా? అనే విషయంపై అధ్యయనం చేయగా అలా జరగలేదని తేలిందన్నారు.
తాజావార్తలు
-
Rs 397 Crore Transformer Scam: ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
-
Redmi Pad 2: రెడ్మి ప్యాడ్ 2 టాబ్లెట్ విడుదల.. 7600mAh బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్లు.. తక్కువ ధరకే
-
JMI VC Mazhar Asif: “భారతీయులందరిది మహాదేవుడి డిఎన్ఏ!”.. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Raw Mango Chutney Recipe: సింపుల్గా మామిడి చట్నీ… 5 నిమిషాల్లో రెడీ అయ్యే రుచికరమైన రెసిపీ
-
Nithya Menen: తల్లి కావడానికి పెళ్లి అక్కర్లేదు.. నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో