Pakistan: తల్లిని పట్టుకుని ఏడ్చిన హిందూ బాలిక.. వెనక్కి తగ్గిన పాకిస్తాన్ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu girl forcibly converted to Islam sent to safe home by court after social media outrage: పాకిస్తాన్ దేశంలో ఇటీవల వరసగా హిందూ బాలికలు, మహిళలు కిడ్నాపుకు గురవుతున్నారు. సింధు ప్రావిన్సులో గత నెల ఇద్దరు బాలికలు కిడ్నాప్ కాగా.. పెళ్లయిన యువతిని కూడా ఇలాగే కిడ్నాప్ చేశారు. ఇటీవల కొన్ని వారం రోజుల క్రితం 14 ఏళ్ల బాలికను, ఈ వారంలో మరో ఇద్దరు బాలికను ఇలాగే కిడ్నాప్ చేశారు. వారందరిని కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని మతం మార్చుతున్నారు. మైనారిటీలుగా ఉన్న హిందువులపై అక్కడి మెజారిటీ వర్గం తీవ్రంగా ప్రవర్తిస్తోంది. మైనారిటీలను పూర్తిగా తుడిచిపెట్టే ఉద్దేశ్యంతో హిందూ బాలికను బలవంతంగా పెళ్లిళ్లు చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు.
ఇదిలా ఉంటే సింధు ప్రావిన్స్ హైదరాబాద్ నగరంలో రెండు నెలల క్రితం పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసి, ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే ఈ ఘటనపై అక్కడి అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా గురువారం కిడ్నాప్ అయిన బాలికను సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు పంపించాలని ఆదేశించింది. కోర్టు మొదట్లో అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించింది. బాలిక భర్త తరుపు కోర్టుకు వివాహ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించింది. దీన్ని కోర్టు అంగీకరించింది. అయితే కోర్టలో బాలిక తన తల్లిని పట్టుకుని ఏడుస్తూ కనిపించడం.. ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోర్టు వెనక్కి తగ్గింది. ఆమెను సురక్షితంగా ఇంటికి పంపాలని కోర్టు ఆదేశించింది.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
Read Also: Komatireddy Venkat Reddy: నేడు ఆస్ట్రేలియాకు కాంగ్రెస్ ఎంపీ.. మునుగోడు ఎన్నిక తరువాతే ఎంట్రీ!
రెండు నెలల క్రితం తన అక్కతో కలిసి మిల్లులో పనిచేసి ఇంటికి వస్తున్న క్రమంలో చందా మెహరాజ్ అనే 15 ఏళ్ల బాలికను హైదరాబాద్ ఫతే చౌక్ లో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేసి, బలవంతంగా 54 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించి, మతం మార్చారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే మొదట్లో పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో మానవహక్కుల సంస్థల విమర్శల నేపథ్యంలో సెప్టెంబర్ లో కేసు నమోదు చేసి, బాలికను బలూచిస్తాన్ ప్రావిన్సులో గుర్తించి హైదరాబాద్ తీసుకువచ్చారు. బాలిక భర్త, ఆమె తల్లిదండ్రులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. బాలిక భర్త సమర్పించిన ఆధారాల్లో బాలిక వయసు 19 ఏళ్లుగా పేర్కొన్నాడు. అయితే తమ కూతురు మైనర్ అని తమకు పోలీసులు సహకరించడం లేదని హిందూ బాలిక తల్లిదండ్రులు తెలిపారు.
బాలికను వైద్యపరీక్షల కోసం కోర్టు ఆదేశించింది. మెడికల్ రిపోర్లులు వచ్చే వరకు భర్త, అమ్మాయితో కానీ ఆమె తల్లిదండ్రులతో కానీ ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని కోర్టు ఆదేశించింది. థార్, ఉమర్ కోట్, మిర్ పూర్ ఖాస్, ఖైర్ పూర్ ప్రాంతాల్లో హిందూ జనాభా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతాల్లో తరుచుగా హిందూ యువతులు, బాలికలు కిడ్నాపులకు గురవుతున్నారు.
https://twitter.com/Prasenjitiswoke/status/1583262577114877953
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!