Pakistan: పాకిస్తాన్లో చైనా వాళ్లు భద్రతా క్రమశిక్షణను పాటించడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయుల గురించి మాట్లాడుతూ.. వారు భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. భద్రతా క్రమశిక్షణ పాటించాలని కోరినప్పడు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు శుక్రవారం చెప్పారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో జరిగిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మరణించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Man Kills Daughter: చదువుకోవడం లేదని.. 17 ఏళ్ల కుమార్తెపై దారుణం..
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైన మరియం ఇటీవల పంజాబ్ సీఎంగా ఎన్నికయ్యారు. తన తొలి అపెక్స్ మీటింగ్లో మాట్లాడన ఆమె.. ఇక్కడ నివసిస్తున్న చైనీయులు భద్రతా క్రమశిక్షణ పాటించడానికి ఇష్టపడటం లేదని అన్నారు, సెక్యూరిటీ ప్రోటోకాల్ అనుసరించాలని అడిగినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వారు ఏ క్రమశిక్షణ కిందకు రావాలని కోరుకోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో కార్ప్స్ కమాండర్ లాహోర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అమీర్ రజా మరియు ఇతర సీనియర్ సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు. పంజాబ్ ప్రావిన్స్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయులకు ఫూల్ ప్రూఫ్ భద్రతను కల్పిస్తామని ఆమె చెప్పారు. బిషమ్లో చైనా ఇంజనీర్ల హత్యను ఆమె ఖండించారు.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని దాసు జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు చైనీయులు ఆత్మాహుతి దాడిలో మరణించారు. షాంగ్లా జిల్లాలోని బిషమ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదం డిజిటలైజ్ అయిందని, వారి కంటే ముందు ఉండాలని, ఉగ్రవాదుల చేతిలో అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికత ఉందని ఆమె అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఆయుధాలు పెద్ద సవాల్గా మారినట్లు మరియం చెప్పారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద చైనా పాకిస్తాన్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీంతో పాటు డ్యామ్లు, రోడ్లు, రైల్ నెట్వర్క్తో పాటు గ్వాదర్ పోర్టును డెవలప్ చేస్తోంది.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!