Pakistan: పాకిస్తాన్లో చైనా వాళ్లు భద్రతా క్రమశిక్షణను పాటించడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయుల గురించి మాట్లాడుతూ.. వారు భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. భద్రతా క్రమశిక్షణ పాటించాలని కోరినప్పడు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు శుక్రవారం చెప్పారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో జరిగిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మరణించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Man Kills Daughter: చదువుకోవడం లేదని.. 17 ఏళ్ల కుమార్తెపై దారుణం..
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైన మరియం ఇటీవల పంజాబ్ సీఎంగా ఎన్నికయ్యారు. తన తొలి అపెక్స్ మీటింగ్లో మాట్లాడన ఆమె.. ఇక్కడ నివసిస్తున్న చైనీయులు భద్రతా క్రమశిక్షణ పాటించడానికి ఇష్టపడటం లేదని అన్నారు, సెక్యూరిటీ ప్రోటోకాల్ అనుసరించాలని అడిగినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వారు ఏ క్రమశిక్షణ కిందకు రావాలని కోరుకోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో కార్ప్స్ కమాండర్ లాహోర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అమీర్ రజా మరియు ఇతర సీనియర్ సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు. పంజాబ్ ప్రావిన్స్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయులకు ఫూల్ ప్రూఫ్ భద్రతను కల్పిస్తామని ఆమె చెప్పారు. బిషమ్లో చైనా ఇంజనీర్ల హత్యను ఆమె ఖండించారు.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని దాసు జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు చైనీయులు ఆత్మాహుతి దాడిలో మరణించారు. షాంగ్లా జిల్లాలోని బిషమ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదం డిజిటలైజ్ అయిందని, వారి కంటే ముందు ఉండాలని, ఉగ్రవాదుల చేతిలో అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికత ఉందని ఆమె అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఆయుధాలు పెద్ద సవాల్గా మారినట్లు మరియం చెప్పారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద చైనా పాకిస్తాన్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీంతో పాటు డ్యామ్లు, రోడ్లు, రైల్ నెట్వర్క్తో పాటు గ్వాదర్ పోర్టును డెవలప్ చేస్తోంది.
తాజావార్తలు
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Protein Food : అమ్మ జ్ఞాపకం.. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే రుచికరమైన లావోటియన్ ‘ఎగ్ హాష్’!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ట్రెండింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!