Bangladesh: పాకిస్తాన్తో 1971 సమస్యల పరిష్కారానికి బంగ్లాదేశ్ సిద్ధం..
- బంగ్లాదేశ్తో సంబంధాలకు పాకిస్తాన్ ఆరాటం..
- విద్యార్థి నేత.. మంత్రి నహీద్ ఇస్లాంతో పాక్ రాయబారి వరస భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ నెమ్మనెమ్మదిగా పాకిస్తాన్కి దగ్గర అవుతోంది. ఏ దేశం నుంచి తమకు స్వాతంత్య్రం కావాలని పోరాడిందో, ప్రస్తుతం షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఆ దేశానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా షేక్ హసీనాను గద్దె దించడంతో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నేత, ప్రస్తుతం బంగ్లా తాత్కాలిక ఐటీ మంత్రిగా ఉన్న నహిద్ ఇస్లాం పాకిస్తాన్ రాయబార అధికారులతో భేటీ అవుతున్నాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అతను పేర్కొన్నాడు. పాకిస్తాన్తో 1971 విముక్తి యుద్ధ సమస్యలను పరిష్కరించుకోవడానికి, ప్రజాస్వామ్య సంబంధాల బలోపేతాన్ని బంగ్లాదేశ్ కోరుకుంటోందని నహీద్ ఇస్లాం చెప్పారు.
Read Also: Bangladesh: పాకిస్తాన్ నుంచి భారీగా ఆయుధాలు కొంటున్న బంగ్లాదేశ్.. ఇండియానే లక్ష్యమా..?
Also Read
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
హసీనా హయాంలో బంగ్లా, పాక్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి, ప్రత్యేకించి 1971 యుద్ధ సమయంలో పాక్కి సహకరించిన జమాతే ఇస్లామీకి చెందిన నాయకులపై యుద్ధ నేరాలు పెట్టారు. ఢాకాలో పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్తో వరస సమావేశాల తర్వాత నహీద్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 01న జరిగిన సమావేశం తర్వాత పాక్తో సంబంధాలను నహీద్ ఇస్లాం కాంక్షించారు. మరోవైపు, గత ప్రభుత్వం చర్చించడానికి మాకు అవకాశం ఇవ్వలేదని, 1971 సమస్యని సజీవంగా ఉంచిందని పాక్ రాయబారి అన్నారు. బంగ్లాతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి పాక్ ఆసక్తి చూపుతోందని అన్నారు.
1971 బంగ్లాదేశ్ చరిత్రలో ఒక ముఖ్య సమస్య అని నహీద్ ఇస్లాం అన్నాడు. అవామీ లీగ్ ప్రకారం.. 1971 చరిత్ర యొక్క చివరి అధ్యాయం, కానీ ఇది చరిత్రకు కొనసాగింపుగా మేము భావిస్తున్నామని చెప్పాడు. 1971 బంగ్లా విముక్తి పోరాటంతో పాక్లో భాగంగా ఉన్న పశ్చిమ పాకిస్తాన్(ఇప్పటి బంగ్లాదేశ్)పై పాక్ ఆర్మీ అకృత్యాలకు పాల్పడింది. 30 లక్షల మరణాలు సంభవించాయి. ఈ దురాగతాలకు బంగ్లా పాక్ నుంచి క్షమాపణలు కోరింది. అయితే గత 53 ఏళ్లుగా ఈ రెండు దేశాల సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ఇప్పటికే సమస్యపై ఎలాంటి పరిష్కారం రాలేదు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!