Bangladesh: ఉల్ఫా చీఫ్ పరేష్ బారూహ్ మరణశిక్షను రద్దు చేసిన బంగ్లాదేశ్ కోర్ట్..
- ఉల్ఫా చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్ష రద్దు చేసిన బంగ్లాదేశ్..
- అస్సాంని విడగొట్టేందుకు ఏర్పడిన ఉగ్రసంస్థ ఉల్ఫా..
- 2004లో అక్రమ ఆయుధాల కేసులో అరెస్టయిన బారుహ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారత వ్యతిరేకి, ఉగ్రసంస్థ ‘‘ఉల్ఫా’’ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షను బంగ్లాదేశ్ కోర్టు రద్దు చేసింది. 2004 ఛటోగ్రామ్ ఆయుధ రవాణా కేసులో బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ఫోజామన్ బాబర్తో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్ర సంస్థ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షని జీవితఖైదుకు తగ్గించినట్లు బంగ్లా మీడియా తెలియజేసింది. భారత్కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కోసం 10 ట్రక్కుల ఆయుధాలను, మందుగుండు సామాగ్రికి సంబంధించింది ఈ కేసు.
2004లో బంగ్లాదేశ్లో బీఎన్పీ, జమాతే ఇస్లామీ అధికారంలో ఉన్న మసయంలో ఈ భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో అప్పటి జూనియర్ హోం శాఖ వ్యవహారాల మంత్రి లుత్ఫోజామన్ బాబర్ ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. బాబర్ 2001-2006 వరకు బీఎన్పీ నేత షేక్ ఖలీదా జియా ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
Read Also: Dinga Dinga: ఉగాండాను వణికిస్తున్న ‘‘డింగా డింగా’’.. అసలేంటి ఈ కొత్త వ్యాధి..?
భారత వ్యతిరేక, పాక్ అనుకూల ప్రభుత్వంగా పేరొందిన షేక్ ఖలిదా జియా హయాంలోని ప్రభుత్వం పరేష్ బారుహ్కి ఆశ్రయం కల్పించింది. బారుహ్ ప్రస్తుతం చైనా నుంచి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఉల్ఫాలోని ఒక వర్గమైన ఉల్ఫా-1కి నాయకత్వం వహిస్తున్నాడు. అస్సాంని విముక్తి చేసే తన వేర్పాటువాద ఎజెండాతో బారుహ్ పనిచేస్తున్నాడు. అయితే, ఈ ఉగ్రసంస్థ ఇతర ప్రధాన నేతలు తుపాకులు పక్కన పెట్టి, కేంద్రంతో చర్చలు నడుపుతున్నారు.
ఈ కేసులో బారుహ్తో పాటు మొత్తం ఆరుగురి మరణశిక్షలను ఎదుర్కొంటుండగా, ప్రస్తుతం బారుహ్కి యావజ్జీవ శిక్ష, మిగిలిన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిసింది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మహ్మద్ యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేకులకు పెద్దపీట వేస్తోంది. ర్యాడికల్ ఇస్లామిస్టులను జైళ్ల నుంచి విడుదల చేస్తోంది.
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి