Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూకేలో చిన్నారులపై అత్యాచారం, బాలల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రుఖ్సార్ అహ్మద్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఎన్నికల్లో విజయం సాధించాడు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం విమర్శలకు తావిస్తోంది. 62 ఏళ్ల రుఖ్సార్ అహ్మద్ను 2024 జూలై 18న మాంచెస్టర్ విమానాశ్రయంలో యూకే పోలీసులు అరెస్టు చేశారు. 1990లలో మాంచెస్టర్లోని రషోల్మ్ ప్రాంతంలో చిన్నారులపై అత్యాచారం, లైంగిక దోపిడీ, అక్రమ రవాణాలో పాల్గొన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. ప్రస్తుతం అతను బెయిల్పై ఉన్నాడు.
జూలైలో పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, ఆరోగ్య కారణాలు చెబుతూ రుఖ్సార్ హాజరుకాలేదు. అయితే, ఇదే సమయంలో పీఓకే లోని మీర్పూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. వచ్చే 6 వారాల్లో ఆయన యూకే పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఒక వేళ హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ లేదా, ఎక్స్ట్రడిషన్(అప్పగింత) ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
చిన్న వయసులో తమపై అత్యాచారం చేసి, లైంగిక అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఇద్దరు మహిళలు రుఖ్సార్ అహ్మద్పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. యూకేలోని మాంచెస్టర్ ప్రాంతంలో రుఖ్సార్ పాకిస్తానీ కమ్యూనిటీలో ప్రభావవంతమైన నేతగా ఉన్నాడు.
యూకేలో ‘‘గ్రూమింగ్ గ్యాంగ్’’ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రుఖ్సార్ అహ్మద్ విషయం చర్చనీయాంశంగా మారింది. యూకేలో గత కొన్ని ఏళ్లుగా బ్రిటిష్ మైనర్ బాలికలపై పాకిస్తానీ మూలానికి చెందిన గ్యాంగులు అత్యాచారానికి పాల్పడి, వారిని లైంగిక అక్రమ రవాణా చేశారు. ఉత్తర ఇంగ్లాండ్ లోని కొన్ని ప్రాంతాల్లోని బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ లైంగిక అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. 2014లో ప్రొఫెసర్ అలెక్సిస్ జే నివేదిక ప్రకారం, రోదర్హామ్ ప్రాంతంలో 1997 నుంచి 2013 మధ్య కనీసం 1,400 మందికి పైగా చిన్నారులు లైంగిక దోపిడీకి గురైనట్లు వెల్లడైంది.
తాజావార్తలు
-
Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!