Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ యూకేకి చెందిన ‘డైలీ టెలిగ్రాఫ్’ వార్తాపత్రిక కోసం రాసిన కాలంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు, తన భార్య ఏమైనా జరిగినా దానికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బాధ్యత వహించాలని అన్నారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ప్రభుత్వానికి ఇది నవ్వులాటగా మారిందని అన్నారు. పాక్ ఆర్మీ తనకు వ్యతిరేకంగా చేయగలిగిందంతా చేసిందని, తనను హత్య చేయడమే మిగిలి ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నా భార్య బుష్రా బీబీకి ఏదైనా జరిగిన పాక్ ఆర్మీదే బాధ్యత అని చెప్పారు. నేను దేనికి భయపడనని, బానిసత్వం కన్నా మరణాన్నే ఇష్టపడుతానని ఆయన అన్నారు. 75 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఎక్కువ కాలం మిలిటరీ పాలకుల పాలనలోనే ఉంది. ఆ దేశ రాజకీయాల్లో మిలిటరీది కీలక పాత్ర. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఆర్మీ కలుగజేసుకుంటుదని ఆరోపించారు.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
Read Also: Amit Shah fake video case: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్..
1971తో తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) కోల్పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని ఖాన్ హెచ్చరించారు. బలూచిస్తాన్లో తీవ్రమవుతున్న తీవ్రవాదం, పరాయికరణ చూస్తోందని, పాకిస్తాన్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ లోపల హత్యలు చేసినట్లు భారత్ ఇప్పటికే అంగీకరించిందని, ఆఫ్ఘనిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు అస్థిరంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రాజకీయంగా తమ ఎన్నికల గెలుపును దొంగిలించారని, ఆర్థికంగా చితికిపోయినందుకు ప్రజలు కోపంతో ఉన్నారని, దేశం ఒంటరిగా ఉందని ఆయన రాశారు. ఫిబ్రవరి 8న తన మద్దతుదారులకు ఎక్కవ స్థానాలు వచ్చినప్పటికీ, సైన్యం మద్దతుతో ఆ ఆదేశాన్ని దొంగిలించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ ట్యాంపరింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టు ఆరుగురు న్యాయమూర్తులపై వేధింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!