Imran Khan: పాకిస్తాన్ ఆర్మీ నన్ను చంపడమే మిగిలింది.. మాజీ ప్రధాని సంచలనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తనలాంటి రాజకీయ నాయకులు జైల్లో మగ్గుతున్న దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీకి తనను చంపడమే మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. అవినీతి కేసుల్లో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ యూకేకి చెందిన ‘డైలీ టెలిగ్రాఫ్’ వార్తాపత్రిక కోసం రాసిన కాలంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు, తన భార్య ఏమైనా జరిగినా దానికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ బాధ్యత వహించాలని అన్నారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ప్రభుత్వానికి ఇది నవ్వులాటగా మారిందని అన్నారు. పాక్ ఆర్మీ తనకు వ్యతిరేకంగా చేయగలిగిందంతా చేసిందని, తనను హత్య చేయడమే మిగిలి ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నా భార్య బుష్రా బీబీకి ఏదైనా జరిగిన పాక్ ఆర్మీదే బాధ్యత అని చెప్పారు. నేను దేనికి భయపడనని, బానిసత్వం కన్నా మరణాన్నే ఇష్టపడుతానని ఆయన అన్నారు. 75 ఏళ్ల పాకిస్తాన్ చరిత్రలో ఎక్కువ కాలం మిలిటరీ పాలకుల పాలనలోనే ఉంది. ఆ దేశ రాజకీయాల్లో మిలిటరీది కీలక పాత్ర. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కూడా ఆర్మీ కలుగజేసుకుంటుదని ఆరోపించారు.
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
Read Also: Amit Shah fake video case: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్..
1971తో తూర్పు పాకిస్తాన్(బంగ్లాదేశ్) కోల్పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందని ఖాన్ హెచ్చరించారు. బలూచిస్తాన్లో తీవ్రమవుతున్న తీవ్రవాదం, పరాయికరణ చూస్తోందని, పాకిస్తాన్ సరిహద్దుల్లో, పాకిస్తాన్ లోపల హత్యలు చేసినట్లు భారత్ ఇప్పటికే అంగీకరించిందని, ఆఫ్ఘనిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు అస్థిరంగా ఉందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రాజకీయంగా తమ ఎన్నికల గెలుపును దొంగిలించారని, ఆర్థికంగా చితికిపోయినందుకు ప్రజలు కోపంతో ఉన్నారని, దేశం ఒంటరిగా ఉందని ఆయన రాశారు. ఫిబ్రవరి 8న తన మద్దతుదారులకు ఎక్కవ స్థానాలు వచ్చినప్పటికీ, సైన్యం మద్దతుతో ఆ ఆదేశాన్ని దొంగిలించారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ ట్యాంపరింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇస్లామాబాద్ హైకోర్టు ఆరుగురు న్యాయమూర్తులపై వేధింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!