PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో శనివారం పాల్గొన్నారు. సిల్చార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మధ్య భారతీయుల్లో ఆందోళనల్ని పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాలను తొలగించేందుకు కృషి చేస్తుందని అన్నారు.
LPG Crisis: భారత్కు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న వేళ, ఉపశనం కలిగించే వార్త వెలువడింది. ముఖ్యంగా వంటగ్యాస్(LPG)కోసం దేశంలోని ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటువంటి సమయంలో ఇరాన్తో భారత్ ఒప్పందాన్ని కదుర్చుకుంది. హార్ముజ్ జలసంధి మీదుగా రెండు LPG ట్యాంకర్లు భారత్ బయలుదేరాయి. ప్రస్తుతం వంటగ్యాస్ కొరతతో సతమతం అవతున్న భారత్కు ఇది పెద్ద ఊరట.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.
Pakistan: ఎప్పుడూ లేనంతగా దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ పెట్టే అన్ని షరతులకు తలొగ్గుతోంది. దీంతో ప్రజలపై పన్నులను పెంచింది, ఇది తీవ్ర నిరసనకు దారి తీస్తోంది.
Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం తీవ్రం అవుతోంది. ఆ దేశానికి మిత్రదేశాలతో పాటు ఐఎంఎఫ్ వద్ద అప్పు పుట్టడం లేదు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక వేళ ఎంత ధర పెట్టి కొందాం అని అనుకున్న మార్కెట్లలో సరుకులు లభించడం లేదు. గోధుమ పిండి కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. గోధుమ కోసం అక్కడి ప్రజలు ఓ యుద్ధాన్నే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే గోధుమ పిండి కేంద్రాల…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే దేశం వదిలిపారిపోయిన గొటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లిన రాజపక్స తన రాజీనామా లేఖను పాక్స్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ కార్యాలయానికి పంపించారు. తాజాగా ఈ రోజు స్పీకర్ మహిందా యాప అబేదర్థనే అధ్యక్షుడి రాజీనామాపై అధికార ప్రకటన చేయనున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత శ్రీలంక నిరసనకారుల్లో ఆనందం కనిపిస్తోంది.…
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు చేజారిపోతున్నాయి. వేలాదిగా నిరసనకారులు కొలంబోలో నిరసనలు, ఆందోళ కార్యక్రమాలు చేపడుతున్నారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళను చేపట్టారు. పరిస్థితులు కట్టుతప్పే ప్రమాదం ఉండటంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన అధికార నివాసాన్ని వదిలి పారిపోయారు. శ్రీలంకన్ ఆర్మీ అధ్యక్షుడిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అధ్యక్ష భవనంతో పాటు, ఆయన పరిపాలన భవనాన్ని ఆందోళనకారులు ఆక్రమించారు. ఆందోళనకారుల్ని అదుపు చేయడంతో ఆర్మీ, పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే…
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. శుక్రవారం దేశంలో పెద్ద ఎత్తున్న నిరసన, ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులు ఏకంగా ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స అధికార నివాసాన్ని, సెక్రటేరియట్ ను ముట్టడించారు. పోలీస్ బందోబస్తు ఉన్నా కూడా ఆందోళకారుల్ని అదుపులో చేయలేకపోయారు. దీంతో నిరసనకారులు ప్రెసిడెంట్ భవనంలోకి ప్రవేశించారు. నిరసనకారులతో మాజీ ఆర్మీ అధికారులు, ప్రముఖ క్రికెటర్లు సనత్ జయసూర్య, కుమార సంగక్కర ఆందోళనలకు మద్దతు పలికారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వీడియో మాత్రం…
శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన, ఆహార సంక్షోభాలతో ఇక్కట్లు పడుతున్న శ్రీలంకలో మరోసారి నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్స అధికారిక భవనాన్ని ముట్టడించారు ఆందోళనకారులు. భద్రతాబలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకువచ్చారు నిరసనకారులు. దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్సను సురక్షిత ప్రాంతానికి తరలించింది శ్రీలంకన్ ఆర్మీ. ఇదిలా ఉంటే రాజపక్స పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు వెంటనే అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్స రాజీనామా…