Dowry Harassment: పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య.. ఆ వేధింపులు భరించలేకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Commits Suicide Due To Dowry Harassment In Karnataka: పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో గొప్పగా ఉంటుందని, అత్తారింట్లో చాలా ఎగ్జైటింగ్గా లైఫ్ సాగుతుందని ఆ యువతి ఎన్నో కలలు కంది. తాను కలలు గన్న రాకుమారుడే భర్తగా వచ్చాడని భావించి, అతనితో సరికొత్త జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆశించింది. కానీ.. పెళ్లైన కొన్నాళ్లకే ఆ యువతి కోరికలన్నీ నీరుగారిపోయాయి. తాను పెళ్లి చేసుకుంది రాకుమారుడ్ని కాదని, రాక్షసుడినని తెలుసుకుంది. అతనితో పాటు కుటుంబ సభ్యులు సైతం తనని వేధింపులకు గురి చేయడంతో.. చావే శరణమని భావించి, సూసైడ్ చేసుకుంది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Naxals Audition for Movie: సినిమాల్లోని రియల్ నక్సలైట్లు.. గడ్చిరోలిలో మూవీ ఆడిషన్
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
చిక్కబళ్లాపురం నగరం కార్కానపేటలో నివసిస్తున్న లోహిత్కు బెంగళూరు రూరల్లోని విజయపురకు చెందిన తేజస్వినితో (28) ఏడాది క్రితం పెళ్లి అయ్యింది. ఇంజనీరింగ్ పూర్తి తేజస్విని.. ఇంట్లో ఏకైక కూతురు కావడంతో, తల్లిదండ్రులు ఆమెను అల్లారుముద్దుగా పెంచారు. తన కూతురి జీవితం బాగుండాలని.. లోహిత్కు భారీగా కట్న కానుకలు ఇచ్చి, పెళ్లి చేశారు. మొదట్లో వీరి సంసార జీవితం సజావుగానే సాగింది. కానీ, కొన్ని రోజుల తర్వాత తేజస్వినికి తన భర్తతో పాటు అన్న, వదినల నుంచి వేధింపులు మొదలయ్యాయి. పుట్టినింటి నుంచి మరింత డబ్బు తేవాలని, అలాగే భూమి రాయించుకు రావాలని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లు హింసించిన ప్రతీసారి.. తేజస్విని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి, బోరుమని విలపించేది. పేరెంట్స్ ఆమెను సర్దిచెప్పి, తిరిగి అత్తారింటికి పంపించేవారు.
Prabhas: ఆ రికార్డ్ సాధించిన ఏకైక హీరో.. దటీజ్ ప్రభాస్
అయితే.. రానురాను భర్త, అన్న, వదినల వేధింపులు మరీ ఎక్కువైపోయాయి. ఆ వేధింపులు భరించలేకపోయిన తేజస్విని, ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడమే శ్రేయస్కరమని అనుకుని, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన తేజస్విని తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. భర్త లోహిత్, అతని అన్నయ్య, వదినలు టార్చర్ పెట్టడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. హంతకుల్ని కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. పోలీసులు రంగంలోకి దిగి భర్త లోహిత్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే.. డెత్ నోట్తో పాటు తేజస్వినికి సంబంధించిన కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
-
Pooja Hegde: సీఎంపైనే పూజా హెగ్డే ఆశలు!
-
Heavy Rain Alert: ఏపీపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!