AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- ఏపీలో మోగనున్న బడిగంట
- రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
- ఏడాది క్యాలెండర్ విడుదల చేసిన విద్యాశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో బడిగంటకు వేళాయింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. శుక్రవారం నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఏడాది క్యాలెండర్ను విడుదల చేసింది. 229 పని దినాలు, 87 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్ను సైతం విద్యాశాఖ విడుదల చేసింది.

Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
రెండు నెలల పాటు చిన్నారులు ఆటాపాటలతో ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఇప్పుడు మళ్లీ బ్యాగ్లు భుజాన వేసుకుని.. పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం దగ్గర పడింది. నేటితో వేసవి సెలవులు ముగియడంతో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.

విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు ఉండగా, 87 రోజులు సెలవులు కేటాయించారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు పాఠ్యాంశాల పూర్తి, పరీక్షల నిర్వహణకు అనుగుణంగా ఈ క్యాలెండర్ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దసరా, సంక్రాంతి, క్రిస్మస్ తదితర ప్రధాన పండుగల సందర్భంగా సెలవులను ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు కలిపి మొత్తం 87 రోజుల విరామం లభించనుంది.
అంతేకాకుండా విద్యాశాఖ వార్షిక పరీక్షలు, త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, సమయపాలన పాటించడం లక్ష్యంగా పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం లభించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరై విద్యలో మరింత రాణించాలని విద్యాశాఖ ఆకాంక్షించింది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!