Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్లో మరోసారి నేపాలి గ్యాంగ్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ చోరీ నగరంలో సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదుతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాల్కు చెందిన కమల్, విమలా దంపతులు పనికి చేరారు. వ్యాపార అవసరాల నిమిత్తం ప్రకాష్ కొద్ది రోజుల క్రితం ముంబైకి వెళ్లగా, కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో లేకపోవడంతో ఈ దంపతులు పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కనిపించలేదు.
Also Read
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
అదే సమయంలో ఇంట్లోని రెండు చోట్ల భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు, వజ్రాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. పూజా గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసుతో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. చోరీకి పాల్పడిన నేపాలి దంపతులే నగలతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు బృందాలను నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపినట్లు సమాచారం. మరోవైపు ఈ దంపతులను ఉద్యోగంలోకి తీసుకువచ్చిన వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాభరణాలు, నగదు విలువపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి లెక్కలు తేలిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న దంపతులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!