Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్లో మరోసారి నేపాలి గ్యాంగ్ కలకలం సృష్టించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లో జరిగిన భారీ చోరీ నగరంలో సంచలనం సృష్టించింది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదుతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హిల్ రిడ్జ్ విల్లాస్లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ప్రకాష్ ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాల్కు చెందిన కమల్, విమలా దంపతులు పనికి చేరారు. వ్యాపార అవసరాల నిమిత్తం ప్రకాష్ కొద్ది రోజుల క్రితం ముంబైకి వెళ్లగా, కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో లేకపోవడంతో ఈ దంపతులు పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రకాష్ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా.. ఇంట్లో పనిచేస్తున్న నేపాలి దంపతులు కనిపించలేదు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
అదే సమయంలో ఇంట్లోని రెండు చోట్ల భద్రపరిచిన బంగారు ఆభరణాలు, నగదు, వెండి వస్తువులు, వజ్రాలు, వజ్రాభరణాలు మాయమైనట్లు గుర్తించారు. పూజా గదిలోని విగ్రహానికి అలంకరించిన బంగారు గొలుసుతో పాటు ఇతర విలువైన వస్తువులు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. చోరీకి పాల్పడిన నేపాలి దంపతులే నగలతో పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీటిలో నాలుగు బృందాలను నేపాల్ సరిహద్దు ప్రాంతాలకు పంపినట్లు సమాచారం. మరోవైపు ఈ దంపతులను ఉద్యోగంలోకి తీసుకువచ్చిన వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాభరణాలు, నగదు విలువపై ఇంకా స్పష్టత రాలేదని, పూర్తి లెక్కలు తేలిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న దంపతులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!