Crime: 18 ఎకరాల కోసం పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే భర్తను చంపిన భార్య..
- ఆస్తి కోసం భర్తను హత్య చేసిన భార్య..
- 18 ఎకరాలు కొట్టేయాలని కుట్ర పన్నిన మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: 45 ఏళ్ల వయసు ఉన్న పెళ్లి కాని వ్యక్తి, తనకు 18 ఎకరాలు ఉందని అయినా వధువు దొరకలేదని తన బాధను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహరాజ్కు చెప్పుకోవడం అతడి చావుకు కారణమైంది. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ, పార్ట్టైమ్ టీచర్, రైతుగా పనిచేస్తున్నారు. అయితే, అతను వధువు కోసం నిరాశ వ్యక్తం చేసిన వీడియో వైరల్ కావడంతో, అతడికి ఉన్న 18 ఎకరాలను కొట్టేయాలని మోసగాళ్లు ప్లాన్ చేశారు.
కట్ చేస్తే, జూన్ 6న ఉత్తర్ ప్రదేశ్ కుషీ నగర్ జాతీయరహదారి పక్కన ఉన్న పొదల్లో తివారీ మృతదేహం లభ్యమైంది. మెడలో కత్తి ఇరుక్కుపోయి కనిపించింది. విచారణ చేస్తే దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. కుషి నగర్ ఎస్పీ సంతోష్ కుమార్ ప్రకారం, సాహిబా బానో అనే మహిళ ఖుషి తివారీగా నటిస్తూ, ఇంద్రకుమార్ తివారీని పెళ్లి చేసుకోవడం ఇష్టమని సోషల్ మీడియాలో సంప్రదించింది.
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
Read Also: Kolkata Rape Case: లా విద్యార్థినిపై అత్యాచారం.. తృణమూల్ కాంగ్రెస్లో విభేదాలు..
ఇంద్రకుమార్, సాహిబా క్రమంగా పరిచయం పెంచుకోవడంతో, ఆమె అతడిని ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్కు పిలిచింది. ఖుషి తివారీ ఇంద్రకుమార్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అననుకున్నారు. ఆమె వివాహ ప్రతిపాదనను ఇంద్రకుమార్ అంగీకరించాడు. ఆ తర్వాత, సదరు మహిళ తన అనుచరులతో ఇంద్రకుమార్కి మెల్లిగా ఉచ్చు బిగించింది. ఇంద్రకుమార్ తాను పెళ్లి చేసుకోవడానికి కుషి నగర్ వెళ్తున్నట్లు బంధువులకు కూడా చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
గోరఖ్పూర్లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారని, కొన్ని రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైందని, మహిళ ఆమె అనుచరులు అతడిని చంపి, అతడి వద్ద ఉన్న నగలు, నగదుతో పారిపోయినట్లు అనుమానిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో సాహిబాను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి నకిలీ ఆధార్ కార్డ్ కూడా తయారు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును ఛేదించడానికి మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కలిసి పనిచేశారు.
తాజావార్తలు
-
Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
-
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!