Crypto : కరీంనగర్ క్రిప్టో గేమ్.. చివరికి ఎవరి చేతిలో లాభం..?
- క్రిప్టో మోసం కేసులో మాజీ కార్పొరేటర్ సతీష్ అరెస్ట్
- “మూడింతల లాభాలు” పేరుతో కోట్ల రూపాయల మోసం
- బాధితుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు వేగం
- ప్రధాన నిందితుడు లోకేష్ కోసం ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crypto : కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ సెప్టెంబర్ 11న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు పరిచయస్తుడైన మాజీ కార్పొరేటర్ సతీష్ “మెటా ఫండ్ క్రిప్టో” పేరుతో ఒక స్కీమ్లో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికాడని భాస్కర్ వివరించారు. ఈ హామీ నమ్మి మొదట రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరికొందరిని తీసుకురావాలని చెప్పడంతో మరో 17 మందిని చేర్చారు. వారి నుండి మొత్తం రూ.1.20 కోట్లు సతీష్ వసూలు చేశాడు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు.
Also Read
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
Teja Sajja : ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్.. అడగ్గానే సాయం చేస్తాడు..
డబ్బులు అడిగిన బాధితులను సతీష్ బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. ఈ వ్యవహారంలో మరో కొంతమంది నిందితులు ఉన్నారని భావించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ అనే మరో కీలక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ క్రిప్టో మోసం కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు, అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చాలామంది ఇప్పటికీ భయంతో ఫిర్యాదు చేయడం లేదని సమాచారం. ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పోలీసులు భావిస్తున్నారు. సతీష్ వద్ద నుండి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సతీష్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.
BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్ సింగ్?.. టర్బోనేటర్ టు అడ్మినిస్ట్రేటర్!
తాజావార్తలు
-
7 Seater Cars: మారుతి ఎర్టిగా నుంచి మహీంద్రా బొలెరో వరకు.. రూ.5.65 లక్షల నుంచి లభించే చౌకైన 7-సీటర్ కార్లు ఇవే
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!