Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ అడిగిన స్నేహితులు
- ఇవ్వలేదని కత్తితో పొడిచి చంపిన ఫ్రెండ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త ఫోన్ కొనుక్కోవడమే ఆ బాలుడికి శాపమైంది. కొత్త మొబైల్ కొన్న ఆనందం ఎంతో సేపు లేకుండానే ఆవిరైపోయింది. స్నేహితుల దుర్బుద్ధి కారణంగా ఒక నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఓ తల్లికి కడుపుకోత మిగిల్చారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని షకర్పూర్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: RK Roja: అవన్నీ వెంటనే డిలీట్ చేయండి.. ఆర్కే రోజా హెచ్చరిక
Also Read
సచిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఢిల్లీలోని సకర్పూర్లో నివాసం ఉంటున్నాడు. సోమవారం స్నేహితుడితో కలిసి మొబైల్ షాపుకి వెళ్లాడు. కోరుకున్న కొత్త మొబైల్ను సొంతం చేసుకున్నాడు. ఆ ఆనందంతో తిరిగి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముగ్గురు స్నేహితులు తారసపడ్డారు. కొత్త ఫోన్ కొన్నందుకు పార్టీ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. ఇది కాస్త ఘర్షణకు దారి తీసింది. స్నేహితుల్లో ఒకడు కత్తి తీసుకుని సచిన్ను పొడిచాడు. బలంగా పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడను ఆస్పత్రికి తరలించారు. అయితే సచిన్ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
ఇది కూడా చదవండి: UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..
ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం షకర్పూర్లో పోలీసులు ఒక వీధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో స్థానికులను వాకబు చేయగా.. స్నేహితుల మధ్య గొడవ జరిగి.. ఒకరిని కత్తితో పొడిచారని చెప్పారు. బాధితుడను ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో చేర్చినట్లుగా సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి ఆరా తీశారు. అప్పటికే బాలుడు మరణించాడు. వెనుక భాగంలో రెండు కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: UP: తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో.. యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం
కొత్త ఫోన్ కొన్నందుకు స్నేహితులు ట్రీట్ అడిగారని.. ఈ విషయంలో ఘర్షణ జరిగి హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సంఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ముగ్గురు కూడా 16 ఏళ్ల వయసు వారేనని గుర్తించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!