Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
- కర్ణాటక రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి..
- ముస్లింలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయమని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
ముస్లింను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ప్రభుత్వ చర్యని ఖండించారు. ‘‘అంగన్వాడీ టీచర్ ఉద్యోగం పొందడానికి ఉర్దూ తప్పనిసరిగా తెలుసుకోవాలనే ప్రకటన ఆమోదయోగ్యం కాదు. ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడానికి కాంగ్రెస్ చేసిన మరో ప్రయత్నం ఇది. ఇది ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం.’’ అని అన్నారు.
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
Read Also: Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉర్దూలో ప్రావీణ్యం కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొంది. ‘‘కర్ణాటక ప్రభుత్వం కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూని విధిస్తోంది. రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ కంటే ఉర్దూకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వివరించాలి’’ అని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
అయితే, దీనిపై ముదిగెరె విద్యాశాఖ ప్రభుత్వ నోటిఫికేషన్పై ఆందోళనకు దిగింది. డిప్యూటీ డైరెక్టర్ రాసిన లేఖలో, స్థానిక జనాభాలో వివిధ సంఘాలు ఉన్నాయని, ముస్లింలు 31.94% మంది ఉన్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జనాభాలో 25 శాతానికి పైగా మైనారిటీ వర్గాలు ఉన్న ప్రాంతాల్లో, కన్నడతో పాటు మైనారిటీ భాషలో ప్రావీణ్యం ఉన్న వర్కర్లను నియమించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!