Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
- కర్ణాటక రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి..
- ముస్లింలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయమని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
ముస్లింను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ప్రభుత్వ చర్యని ఖండించారు. ‘‘అంగన్వాడీ టీచర్ ఉద్యోగం పొందడానికి ఉర్దూ తప్పనిసరిగా తెలుసుకోవాలనే ప్రకటన ఆమోదయోగ్యం కాదు. ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడానికి కాంగ్రెస్ చేసిన మరో ప్రయత్నం ఇది. ఇది ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం.’’ అని అన్నారు.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉర్దూలో ప్రావీణ్యం కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొంది. ‘‘కర్ణాటక ప్రభుత్వం కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూని విధిస్తోంది. రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ కంటే ఉర్దూకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వివరించాలి’’ అని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
అయితే, దీనిపై ముదిగెరె విద్యాశాఖ ప్రభుత్వ నోటిఫికేషన్పై ఆందోళనకు దిగింది. డిప్యూటీ డైరెక్టర్ రాసిన లేఖలో, స్థానిక జనాభాలో వివిధ సంఘాలు ఉన్నాయని, ముస్లింలు 31.94% మంది ఉన్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జనాభాలో 25 శాతానికి పైగా మైనారిటీ వర్గాలు ఉన్న ప్రాంతాల్లో, కన్నడతో పాటు మైనారిటీ భాషలో ప్రావీణ్యం ఉన్న వర్కర్లను నియమించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!