Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
- కర్ణాటక రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి..
- ముస్లింలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయమని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
ముస్లింను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ప్రభుత్వ చర్యని ఖండించారు. ‘‘అంగన్వాడీ టీచర్ ఉద్యోగం పొందడానికి ఉర్దూ తప్పనిసరిగా తెలుసుకోవాలనే ప్రకటన ఆమోదయోగ్యం కాదు. ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడానికి కాంగ్రెస్ చేసిన మరో ప్రయత్నం ఇది. ఇది ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం.’’ అని అన్నారు.
Also Read
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్పై కాంగ్రెస్ ఫైర్..
- CJP: AAP డూప్లికేట్గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
Read Also: Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉర్దూలో ప్రావీణ్యం కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొంది. ‘‘కర్ణాటక ప్రభుత్వం కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూని విధిస్తోంది. రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ కంటే ఉర్దూకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వివరించాలి’’ అని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
అయితే, దీనిపై ముదిగెరె విద్యాశాఖ ప్రభుత్వ నోటిఫికేషన్పై ఆందోళనకు దిగింది. డిప్యూటీ డైరెక్టర్ రాసిన లేఖలో, స్థానిక జనాభాలో వివిధ సంఘాలు ఉన్నాయని, ముస్లింలు 31.94% మంది ఉన్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జనాభాలో 25 శాతానికి పైగా మైనారిటీ వర్గాలు ఉన్న ప్రాంతాల్లో, కన్నడతో పాటు మైనారిటీ భాషలో ప్రావీణ్యం ఉన్న వర్కర్లను నియమించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!