Karnataka: రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి.. “ముస్లిం బుజ్జగింపు” అని బీజేపీ ఫైర్..
- కర్ణాటక రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్లకు ఉర్దూ తప్పనిసరి..
- ముస్లింలను బుజ్జగించేందుకు ఈ నిర్ణయమని బీజేపీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచిత్రమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మదిగెరె, చిక్కమగళూర్ జిల్లా్ల్లో అంగన్వాడీ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు ఉర్దూ భాషని తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో కన్నడ మాట్లాడాలని, కన్నడిగులకు తొలి ప్రాధాన్యం ఇస్తామి చెబుతున్న ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆదేశాలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తో్ంది.
ముస్లింను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. బీజేపీ మాజీ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ ప్రభుత్వ చర్యని ఖండించారు. ‘‘అంగన్వాడీ టీచర్ ఉద్యోగం పొందడానికి ఉర్దూ తప్పనిసరిగా తెలుసుకోవాలనే ప్రకటన ఆమోదయోగ్యం కాదు. ముస్లిం సమాజాన్ని సంతృప్తి పరచడానికి మరియు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేయడానికి కాంగ్రెస్ చేసిన మరో ప్రయత్నం ఇది. ఇది ప్రమాదకరమైన రాజకీయ వ్యూహం.’’ అని అన్నారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Andhra Pradesh: ధాన్యం కొనుగోళ్లపై గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం
చిక్కమగళూరు జిల్లా ముదిగెరెలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉర్దూలో ప్రావీణ్యం కలిగి ఉండాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం నెలకొంది. ‘‘కర్ణాటక ప్రభుత్వం కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో ఉర్దూని విధిస్తోంది. రాష్ట్ర అధికార భాష అయిన కన్నడ కంటే ఉర్దూకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ వివరించాలి’’ అని కర్ణాటక బీజేపీ ఎక్స్ వేదికగా ప్రశ్నించింది.
అయితే, దీనిపై ముదిగెరె విద్యాశాఖ ప్రభుత్వ నోటిఫికేషన్పై ఆందోళనకు దిగింది. డిప్యూటీ డైరెక్టర్ రాసిన లేఖలో, స్థానిక జనాభాలో వివిధ సంఘాలు ఉన్నాయని, ముస్లింలు 31.94% మంది ఉన్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, జనాభాలో 25 శాతానికి పైగా మైనారిటీ వర్గాలు ఉన్న ప్రాంతాల్లో, కన్నడతో పాటు మైనారిటీ భాషలో ప్రావీణ్యం ఉన్న వర్కర్లను నియమించాలని పేర్కొంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!