Crime News: మంత్రగాడి మాటలు నమ్మి మనవడిని బలి ఇచ్చిన తాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. 11వ తరగతి విద్యార్థి పీయూష్ సింగ్ అలియాస్ యశ్ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆ ప్రాంతాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు సరణ్ సింగ్ అరెస్టు కాగా, తాజాగా ఈ హత్య వెనుక కారణంగా నిలిచిన మంత్రగాడిని కూడా పోలీసులు పట్టుకున్నారు.
CM Revanth Reddy: అక్బరుద్దీన్.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు!
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
పోలీసుల ప్రకారం.. ఈ హత్యకు కారణం మంత్రగాడి “బలి” సూచన. ప్రధాన నిందితుడు సరణ్ సింగ్, సంబంధాల పరంగా బాధిత విద్యార్థి యశ్కు తాతయ్యవుతాడు. ఆగస్టు 26న స్కూల్కు వెళ్లే సమయంలో సరణ్ సింగ్ యశ్ను ఇంటికి పిలిచి, ఆపై హత్య చేసి శవాన్ని తొమ్మిది ముక్కలు చేశాడు. ఆ తరువాత వాటిని వివిధ చోట్ల పారవేశాడు. ఇక ఈ హత్య వెనుక తాంత్రికుడు మున్నాలాల్ (45) పాత్ర ఉందని దర్యాప్తులో తేలింది. అతను కౌశాంబీ జిల్లాలోని ధుస్కహా గ్రామానికి చెందినవాడు. తాంత్రిక విద్యల పేరుతో ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. అతన్ని ఆదివారం సాయంత్రం కరేలీ లేబర్ చౌరాహా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tollywood : కోడల్ని కూతురిలా చూసుకున్న..వేరే కాపురం పెట్టిన నాగ శౌర్య తల్లి ఎమోషనల్ కామెంట్స్
పోలీసు విచారణలో మున్నాలాల్ నేరాన్ని అంగీకరించాడు. సరణ్ సింగ్ కుటుంబంలో జరిగిన ఆత్మహత్యల కారణంగా అతను మానసికంగా కలత చెందగా, తన ఇంట్లో చెడుఆత్మల ప్రభావం ఉందని చెప్పి మోసం చేశాడు. యశ్ను బలి ఇవ్వాలని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా శవాన్ని తొమ్మిది ముక్కలు చేసి వేర్వేరు దిశల్లో పడేయమని సూచించాడు. ప్రధాన నిందితుడు సరణ్ సింగ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు మంత్రగాడు మున్నాలాల్ పట్టుబడడంతో కేసు కీలకమైన మలుపు తిరిగింది. పోలీసులు అతనిని మరింతగా విచారిస్తున్నారు. మొత్తానికి, తాంత్రిక మోసాల వల్ల అమాయక విద్యార్థి ప్రాణం బలైపోవడం సమాజాన్ని కుదిపేసింది.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!