Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy Responds To Akbaruddin Owaisi On Kaleshwaram Report Debate

CM Revanth Reddy: అక్బరుద్దీన్‌.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు!

Published Date :September 1, 2025 , 8:57 am
By Sampath Kumar
  • కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో స్పందించిన అక్బరుద్దీన్‌
  • ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏం చేయనుందో సమాధానం చెప్పాలని డిమాండ్
  • అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: అక్బరుద్దీన్‌.. నాతో మజాక్ చెయ్, ప్రభుత్వంతో వద్దు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏం చేయనుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా?, నిలిపివేస్తరా? లేదా కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. జస్టిస్‌ పీసీ ఘోష్‌ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని, వారికి డ్యామ్‌ డ్యామేజీలో బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలకు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎటీఎంలుగా మారాయని ఫైర్‌ అయ్యారు. కాంట్రాక్టర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే బాండ్లు ఇస్తారని.. సీపీఐ, ఎంఐఎం పార్టీలకు ఇవ్వరని అక్బరుద్దీన్‌ పేర్కొన్నారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ… ‘కమిషన్ నివేదికలో కాంట్రాక్టర్లపై చర్యలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంట్రాక్టర్ల తమాషా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర వీరే.. కేసీఆర్ దగ్గర వీరే.. ఇప్పుడు కూడా ఆ కాంట్రాక్టర్లే. కాంట్రాక్టర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకే బాండ్లు ఇస్తారు.. సీపీఐ, ఎంఐఎం పార్టీలకు ఇవ్వరు. కమిషన్ కాంట్రాక్టర్లపై చర్యలు డిమాండ్ చేయకపోతే ఏం లాభం?. బడా కాంట్రాక్టర్లను వదిలేసి.. పేద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వండి సీఎం గారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ పెట్టలేదు, సభలోనే చర్చిద్దాం అని ప్రభుత్వం చెప్తుంది. ఎప్పుడైనా కేబినెట్లో మంత్రులు సిఫార్సు చేస్తారు. ఇప్పుడేమో విచిత్రంగా సభలో నిర్ణయం తీసుకుంటారు అంట. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మీరు సభలో నివేదిక పెట్టి ఏం చర్యలు తీసుకోవాలో చెప్పండి అంటున్నారు, బీఆర్ఎస్ ఏం చెప్తుంది?’ అని ప్రశ్నించారు.

Also Read: CM Revanth Reddy: రాళ్లతో కొట్టలేదు, నడి రోడ్డులో ఉరి వేయలేదు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్!

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ‘కమిషన్ అన్ని అంశాలు మెన్షన్ చేశారు. అక్బరుద్దీన్.. మీరు పొరపాటు పడుతున్నారు. నేను రిపోర్ట్ చదవకుండా చెప్పను. నేను పేజీ నెంబర్లతో సహా చెప్తున్నా. విజిలెన్స్ నివేదిక కూడా అధికారికంగా కమిషన్కి ఇచ్చాం. గంటన్నర మీరు మాట్లాడినా నేను సైలెంట్‌గా ఉన్నా. కానీ సభను మీరు తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. మేము మీ సలహాలు కోరుతున్నాం, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇవ్వకున్నా మేము చర్యలు తీసుకుంటాం. చర్యలు ఎలా తీసుకోవాలో మాకు తెలుసు. అక్బరుద్దీన్.. మీరు నాకు మంచి దోస్తు. నాతో మజాకా చెయ్ కానీ ప్రభుత్వంతో చేయొద్దు. 8బి కింద జస్టిస్ నరసింహారెడ్డి నోటీసు ఇవ్వలేదు కాబట్టి చెల్లదు అని వాదించారు. ఇప్పుడు ఘోష్ నివేదికపై 8 బి కింద నోటీసులు ఇవ్వలేదు కాబట్టి చెల్లదు అంటున్నారు. అక్బరుద్దీన్ గారికి ఉన్నంత నాలెడ్జీ లేకపోవచ్చు కానీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ఓపిక ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మీ సలహా ఏంటో చెప్పండి. రాత్రి 12 అయినా ఎందుకు సభలో ఉన్నాం చేయాలనే కదా.. మేము చేయలేక కాదు’ అని సీఎం అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akbaruddin Owaisi
  • Kaleshwaram project
  • Kaleshwaram Project Scam
  • kcr
  • revanth reddy

తాజావార్తలు

  • Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!

  • హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!

  • Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?

  • Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!

  • Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions