Child P*rn : చైల్డ్ పో*ర్న్ రాకెట్టు గుట్టు రట్టు.. తెలంగాణలో 24 మంది అరెస్ట్
- సైబర్ బ్యూరో భారీ ఆపరేషన్
- హైదరాబాద్లో అధిక నిందితులు
- మిడిల్ క్లాస్ ఉద్యోగుల పేర్లు వెలుగు
- పబ్లలో యువతులపై బ్లాక్మెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అమానుషమైన, చట్టవిరుద్ధ చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18 టీమ్లను ఏర్పాటు చేసి, రైడ్లు నిర్వహించి షాకింగ్ వివరాలను వెలికితీసింది. ఆపరేషన్లో భాగంగా చైల్డ్ పోర్న్ వీడియోలను చూస్తూ, షేర్ చేస్తూ, డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేస్తూ ఉన్న 24 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు హైదరాబాద్కు చెందినవారేనని, అరెస్ట్ అయిన వారి వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్యగా ఉన్నట్టు అధికారిక సమాచారం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వీరిలో చాలామంది మిడిల్ క్లాస్ వర్గానికి చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్. అంతేకాక, నిందితుల్లో ఒకరు ఇరిగేషన్ శాఖ ఉద్యోగి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Question Paper Leak : అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ గుట్టురట్టు.. 35 మంది విద్యార్థులపై వేటు..!
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
సైబర్ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం వీరు యాక్సెస్ చేసిన వీడియోల్లోని బాధితులంతా విదేశాలకు చెందిన, 4 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులే. నేషనల్, ఇంటర్నేషనల్ డేటాబేస్ల ద్వారా ఈ వీడియోలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లకు వెళ్లే యువతులను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి సన్నిహితంగా మారి, తర్వాత వారి ఫోటోలు, వీడియోలను కారణంగా చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న రానా ప్రతాప్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పబ్స్ కు వెళ్ళే అమ్మాయిలను టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పక్క టేబుల్ లో ఇన్నోసెంట్ అమ్మాయి కనిపిస్తే ట్రాప్ చేసి, మాయమాటలు చెప్పి లోబర్చుకుని కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఒక యువతి నుంచి 1 కోటి 30 లక్షలు డబ్బు వసూలు చేశాడు. దీంతో బాధిత యువతి ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు. 18 నెలల్లో కేటుగాడు రూ.కోటి వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు రానా ప్రతాప్ రెడ్డి ని రిమాండ్ తరలించిన పోలీసులు వెల్లడించారు.
APSRTC Rental Bus Owners Strike Call Off: ఏపీఎస్ఆర్టీసీలో సమ్మెకు తెర..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!