IT Companies: ఐటీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆఫీసులకు వచ్చి పనిచేస్తే అదనపు జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో వేరియబుల్ పే చెల్లించడం, వినోద, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాయి. దీంతో క్రమంగా ఆఫీసులకొచ్చే సిబ్బంది సంఖ్య 40 శాతానికి చేరిందని సమాచారం.
Read Also: Anasuya: ట్రెండింగ్లో ‘ఆంటీ’.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనున్న ప్రముఖ యాంకర్
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
మరోవైపు ఐటీ పరిశ్రమలో సిబ్బంది వలసల రేటు 15 నుంచి 20 శాతంగా నమోదైంది. నిపుణులకు డిమాండ్ అధికంగా ఉండటంతో మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీకి మారడం గత ఏడాదిన్నర కాలంగా అధికమైంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లభిస్తుండటంతో కంపెనీలు నిపుణులను నియమించుకునేందుకు ఎంత ప్యాకేజీలు ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. అటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మూడు నుంచి 5 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. కాస్త అనుభవం రాగానే ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం అయ్యేందుకు ఆఫీసుకు పిలిపిస్తున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. అటు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల పలు కంపెనీలకు బిల్డింగ్ అద్దె, విద్యుత్, రవాణా, ఇంటర్నెట్ ఖర్చులు, ఇతర వ్యయాలు తగ్గాయి. ఈ మేరకు పలు కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!