Hindenburg : భారత్ పై హిండెన్బర్గ్ సంచలన పోస్ట్.. మార్కెట్ పతనమవుతుందా?
- అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్
- భారత్ పై ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన
- నివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్
- ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది
- అసలేం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది…ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది. అమెరికన్ కంపెనీ భారతీయ కంపెనీకి సంబంధించిన మరో పెద్ద అంశాన్ని బహిర్గతం చేసేందుకు యత్నిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇప్పుడు ఈ పోస్ట్ తో ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: Uppu Kappurambu : హీరో సుహాస్ ను అలా పట్టుకుని ఫోజ్ ఇచ్చిన కీర్తి సురేష్
Also Read
- Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
- Womens: మహిళలకు శుభవార్త.. మే నెలలోనే అకౌంట్లోకి రూ.1000..
- Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
- Coal Gasification Scheme: బొగ్గు నుంచి సింథటిక్ గ్యాస్.. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు.. 50,000 జాబ్స్!
దేని విషయంలో అనేది హిండెన్బర్గ్ చెప్పలేదు. మరోసారి భారతీయ కంపెనీ గురించి పెద్ద బహిర్గతం చేయబోతున్నట్లు సమాచారం. జనవరి 2023లో, హిండెన్బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేసినందున ఈ నివేదిక సంచలనం సృష్టించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వెలువడిన వెంటనే.. అదానీ గ్రూప్లోని అన్ని షేర్లలో భారీ క్షీణత సంభవించింది. ప్రపంచంలో నంబర్ 2 బిలియనీర్ గా ఉన్న అదానీ 36వ స్థానానికి పడిపోయారు. ఎందుకంటే అతని సంపదలో రికార్డు తగ్గుదల నమోదైంది.
READ MORE:Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్కు సంబంధించిన నివేదికను పబ్లిక్ చేయడానికి రెండు నెలల ముందు న్యూయార్క్కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్డన్కు పంపినట్లు సెబీ విచారణ వెల్లడించింది. హిండెన్బర్గ్ వ్యూహాత్మకంగా అదానీ గ్రూప్ షేర్ల ధరను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కింగ్డన్ కంపెనీ కింగ్డన్ క్యాపిటల్కి కూడా కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లో గణనీయమైన షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ వాల్యుయేషన్ కూడా వేగంగా పడిపోయింది. కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ 86 బిలియన్ డాలర్లు తగ్గిన పరిస్థితి నెలకొంది. షేర్ ధరలో ఈ భారీ పతనం తరువాత సమూహం యొక్క విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించడానికి దారితీసింది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
తాజావార్తలు
-
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’!
-
Akash Ambani: జియో సామ్రాజ్యానికి కొత్త బాస్.. అంబానీ వారసుడి చేతికి జియో ప్లాట్ఫామ్స్ పగ్గాలు!
-
Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
-
Weather Forecast: అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు.. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు!
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?