Hindenburg : భారత్ పై హిండెన్బర్గ్ సంచలన పోస్ట్.. మార్కెట్ పతనమవుతుందా?
- అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్
- భారత్ పై ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన
- నివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్
- ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది
- అసలేం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది…ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది. అమెరికన్ కంపెనీ భారతీయ కంపెనీకి సంబంధించిన మరో పెద్ద అంశాన్ని బహిర్గతం చేసేందుకు యత్నిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇప్పుడు ఈ పోస్ట్ తో ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: Uppu Kappurambu : హీరో సుహాస్ ను అలా పట్టుకుని ఫోజ్ ఇచ్చిన కీర్తి సురేష్
Also Read
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
దేని విషయంలో అనేది హిండెన్బర్గ్ చెప్పలేదు. మరోసారి భారతీయ కంపెనీ గురించి పెద్ద బహిర్గతం చేయబోతున్నట్లు సమాచారం. జనవరి 2023లో, హిండెన్బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేసినందున ఈ నివేదిక సంచలనం సృష్టించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వెలువడిన వెంటనే.. అదానీ గ్రూప్లోని అన్ని షేర్లలో భారీ క్షీణత సంభవించింది. ప్రపంచంలో నంబర్ 2 బిలియనీర్ గా ఉన్న అదానీ 36వ స్థానానికి పడిపోయారు. ఎందుకంటే అతని సంపదలో రికార్డు తగ్గుదల నమోదైంది.
READ MORE:Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్కు సంబంధించిన నివేదికను పబ్లిక్ చేయడానికి రెండు నెలల ముందు న్యూయార్క్కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్డన్కు పంపినట్లు సెబీ విచారణ వెల్లడించింది. హిండెన్బర్గ్ వ్యూహాత్మకంగా అదానీ గ్రూప్ షేర్ల ధరను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కింగ్డన్ కంపెనీ కింగ్డన్ క్యాపిటల్కి కూడా కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లో గణనీయమైన షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ వాల్యుయేషన్ కూడా వేగంగా పడిపోయింది. కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ 86 బిలియన్ డాలర్లు తగ్గిన పరిస్థితి నెలకొంది. షేర్ ధరలో ఈ భారీ పతనం తరువాత సమూహం యొక్క విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించడానికి దారితీసింది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
తాజావార్తలు
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!