Hindenburg : భారత్ పై హిండెన్బర్గ్ సంచలన పోస్ట్.. మార్కెట్ పతనమవుతుందా?
- అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్
- భారత్ పై ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన
- నివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్
- ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది
- అసలేం జరగనుంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మీకు గుర్తుండే ఉంటుంది…ఆ సంస్థ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు భారత్ ను ఆందోళనకు గురి చేస్తోంది. శనివారం ఉదయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. ‘సమ్థింగ్ బిగ్ సూన్ ఇండియా’ అని రాసుకొచ్చింది. అమెరికన్ కంపెనీ భారతీయ కంపెనీకి సంబంధించిన మరో పెద్ద అంశాన్ని బహిర్గతం చేసేందుకు యత్నిస్తోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇప్పుడు ఈ పోస్ట్ తో ఆందోళన వ్యక్తమవుతోంది.
READ MORE: Uppu Kappurambu : హీరో సుహాస్ ను అలా పట్టుకుని ఫోజ్ ఇచ్చిన కీర్తి సురేష్
Also Read
- Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
- Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
- Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
దేని విషయంలో అనేది హిండెన్బర్గ్ చెప్పలేదు. మరోసారి భారతీయ కంపెనీ గురించి పెద్ద బహిర్గతం చేయబోతున్నట్లు సమాచారం. జనవరి 2023లో, హిండెన్బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ను లక్ష్యంగా చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ అనేక తీవ్రమైన ఆరోపణలు చేసినందున ఈ నివేదిక సంచలనం సృష్టించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వెలువడిన వెంటనే.. అదానీ గ్రూప్లోని అన్ని షేర్లలో భారీ క్షీణత సంభవించింది. ప్రపంచంలో నంబర్ 2 బిలియనీర్ గా ఉన్న అదానీ 36వ స్థానానికి పడిపోయారు. ఎందుకంటే అతని సంపదలో రికార్డు తగ్గుదల నమోదైంది.
READ MORE:Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..
హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్కు సంబంధించిన నివేదికను పబ్లిక్ చేయడానికి రెండు నెలల ముందు న్యూయార్క్కు చెందిన హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్డన్కు పంపినట్లు సెబీ విచారణ వెల్లడించింది. హిండెన్బర్గ్ వ్యూహాత్మకంగా అదానీ గ్రూప్ షేర్ల ధరను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందేందుకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. కింగ్డన్ కంపెనీ కింగ్డన్ క్యాపిటల్కి కూడా కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్లో గణనీయమైన షేర్లు ఉన్నాయి. ఆ తర్వాత కంపెనీ వాల్యుయేషన్ కూడా వేగంగా పడిపోయింది. కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ 86 బిలియన్ డాలర్లు తగ్గిన పరిస్థితి నెలకొంది. షేర్ ధరలో ఈ భారీ పతనం తరువాత సమూహం యొక్క విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించడానికి దారితీసింది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!