Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి.. పోలీసులకు అల్టిమేటం
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం.. హత్యపై బెంగాల్లో నిరసనలు
- పోలీసులకు సీఎం మమతా బెనర్జీ వార్నింగ్
- ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలి- సీఎం మమత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు. అలాగే.. ఈ సంఘటన “చాలా బాధాకరమైనది”, “దిగ్భ్రాంతికరమైనది” అని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇంకొందరున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
Read Also: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
“మేము ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి డాగ్ స్క్వాడ్, వీడియో రికార్డ్.. ఫోరెన్సిక్ విభాగాన్ని నియమించాము. ఆదివారం నాటికి కోల్కతా పోలీసులు కేసును ఛేదించలేకపోతే, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తాము” అని మమతా బెనర్జీ చెప్పారు. “ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని వెంటనే శిక్షించాలి. ఈ కేసును వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము.. ఎందుకంటే న్యాయ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. నర్సులు ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.”ఆమె పేర్కొన్నారు. “లోపల ఇంకొందరు ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని నేను పోలీసులకు చెప్పాను. మేము ఈ ఆసుపత్రి ప్రిన్సిపాల్, డిపార్ట్మెంట్ హెడ్, మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ (MSVP), ASPని తొలగించాము” అని సీఎం మమత చెప్పారు.
Read Also: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
కాగా.. ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ కోల్కతా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం (ఆగస్టు 13) కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు.. ఈ ఘటనకు నిరసనగా వేలాది మంది వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డిఎ) సభ్యులు ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని సహా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..