Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి.. పోలీసులకు అల్టిమేటం
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం.. హత్యపై బెంగాల్లో నిరసనలు
- పోలీసులకు సీఎం మమతా బెనర్జీ వార్నింగ్
- ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలి- సీఎం మమత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు. అలాగే.. ఈ సంఘటన “చాలా బాధాకరమైనది”, “దిగ్భ్రాంతికరమైనది” అని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇంకొందరున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
Read Also: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
“మేము ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి డాగ్ స్క్వాడ్, వీడియో రికార్డ్.. ఫోరెన్సిక్ విభాగాన్ని నియమించాము. ఆదివారం నాటికి కోల్కతా పోలీసులు కేసును ఛేదించలేకపోతే, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తాము” అని మమతా బెనర్జీ చెప్పారు. “ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని వెంటనే శిక్షించాలి. ఈ కేసును వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము.. ఎందుకంటే న్యాయ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. నర్సులు ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.”ఆమె పేర్కొన్నారు. “లోపల ఇంకొందరు ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని నేను పోలీసులకు చెప్పాను. మేము ఈ ఆసుపత్రి ప్రిన్సిపాల్, డిపార్ట్మెంట్ హెడ్, మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ (MSVP), ASPని తొలగించాము” అని సీఎం మమత చెప్పారు.
Read Also: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
కాగా.. ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ కోల్కతా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం (ఆగస్టు 13) కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు.. ఈ ఘటనకు నిరసనగా వేలాది మంది వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డిఎ) సభ్యులు ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని సహా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!