Mamata Banerjee: ట్రైనీ డాక్టర్పై అత్యాచారం-హత్య కేసును వేగంగా ఛేదించాలి.. పోలీసులకు అల్టిమేటం
- కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం.. హత్యపై బెంగాల్లో నిరసనలు
- పోలీసులకు సీఎం మమతా బెనర్జీ వార్నింగ్
- ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలి- సీఎం మమత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు. అలాగే.. ఈ సంఘటన “చాలా బాధాకరమైనది”, “దిగ్భ్రాంతికరమైనది” అని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇంకొందరున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
Read Also: Venu Swamy: నాగచైతన్య-శోభిత జాతకంను అందుకే చెప్పా.. ఇచ్చిన మాటపై నిలబెడుతా: వేణుస్వామి
Also Read
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
“మేము ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి డాగ్ స్క్వాడ్, వీడియో రికార్డ్.. ఫోరెన్సిక్ విభాగాన్ని నియమించాము. ఆదివారం నాటికి కోల్కతా పోలీసులు కేసును ఛేదించలేకపోతే, ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తాము” అని మమతా బెనర్జీ చెప్పారు. “ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని వెంటనే శిక్షించాలి. ఈ కేసును వేగవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము.. ఎందుకంటే న్యాయ ప్రక్రియ త్వరగా జరుగుతుంది. నర్సులు ఉన్నప్పటికీ ఈ సంఘటన జరగడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.”ఆమె పేర్కొన్నారు. “లోపల ఇంకొందరు ఉన్నారని బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని నేను పోలీసులకు చెప్పాను. మేము ఈ ఆసుపత్రి ప్రిన్సిపాల్, డిపార్ట్మెంట్ హెడ్, మెడికల్ సూపరింటెండెంట్ కమ్ వైస్ ప్రిన్సిపాల్ (MSVP), ASPని తొలగించాము” అని సీఎం మమత చెప్పారు.
Read Also: Minister Nadendla Manohar: ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం.. 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి సొమ్ము..
కాగా.. ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ కోల్కతా హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై మంగళవారం (ఆగస్టు 13) కోర్టు విచారణ చేపట్టనుంది. మరోవైపు.. ఈ ఘటనకు నిరసనగా వేలాది మంది వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. ఢిల్లీ ఎయిమ్స్లోని రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఆర్డిఎ) సభ్యులు ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం ఇవ్వాలని సహా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
-
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!