Byju’s: 500 మంది ఉద్యోగులను తొలగించనున్న బైజూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byju’s: ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ తొలగింపు ప్రక్రియ 15-20 రోజుల క్రితమే ప్రారంభమైందని తెలుస్తోంది. దాదాపుగా 500 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. తాజాగా ఉద్యోగాల కోత సేల్స్ ఫంక్షన్స్, టీచర్లు, ట్యూషన్ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. అయితే, అధికారికంగా బైజూన్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కొంతమంది సిబ్బందికి ఫోన్ల ద్వారా తాజా పరిణామాల గురించి తెలియజేశారు.
అక్టోబర్ 2023లో ప్రకటించిన బిజినెస్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా మెరుగైన నగదు ప్రవాహ నిర్వహణ, ఆపరేటింగ్ స్ట్రక్చరింగ్, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో చివరి దశలో ఉన్నామని బైజూస్ ప్రతినిధి చెబుతున్నారు. నలుగురు విదేశీ పెట్టుబడిదారులతో కొనసాగుతున్న వ్యాజ్యం కారణంగా కంపెనీ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటుందని, ఇక్కడ ప్రతీ ఉద్యోగి, ఎకో సిస్టమ్ తీవ్రంగా ఒత్తిడికి గురవుతోందని చెప్పారు.
Also Read
- FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
- Stock Market: 27 నిమిషాల్లోనే రూ.2.82 లక్షల కోట్లు లాభం! స్టాక్ మార్కెట్లో ఈ రోజు ఇన్వెస్టర్లకు పండగే!
- Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
Read Also: Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!
వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా దాదాపుగా 4500 మందిపై ప్రభావం చూపుతుందని ఇంతకుముందు బైజూస్ చెప్పింది. ఆ తర్వాత 2023 అక్టోబర్-నవంబర్లో 2500-3000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటి వరకు 3000-3500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని అనుకుంటే, మరో 1000-1500 మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి వేతనాల పంపిణీలో జాప్యం ఏర్పడుతుందని ఇటీవల కంపెనీ తన ఉద్యోగులకు చెప్పింది.
బైజూస్ సీఈఓ రవీంద్రన్తో సహా సహవ్యవస్థాపకులను తొలగించి, కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. పెట్టుబడిదారుల సమూహం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు పిటిషన్ దాఖలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఓ వెలుగు వెలిగిన బైజూస్, తర్వాత ఫిజికల్ క్లాసులు ప్రారంభం కావడం, ఆకాష్ కొనుగోలు చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులకు గురైంది.
తాజావార్తలు
-
Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!
-
CM Chandrababu: వీబీజీ రామ్జీ పథకానికి శ్రీకారం.. గ్రామాల అభివృద్ధిపై చంద్రబాబు భారీ ప్రకటనలు
-
Moto G77 Power: మోటో జి77 పవర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 50MP Sony LYTIA 600 కెమెరా
-
KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
-
Jailer 2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్కు కౌంట్డౌన్.. ఈ సాయంత్రం రజనీ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?