Venu Goapl Reddy
Author- NTV Telugu-
Teen Kills Mother: తల్లిని చంపి 5 రోజులు శవంతోనే.. దుర్వాసన కవర్ చేసేందుకు అగర్బత్తీలు..
Teen Kills Mother: కొడుకుని స్కూల్ వెళ్లాలని నిద్రలేపేందుకు వెళ్లిన తల్లి హత్యకు గురవుతుందని ఎవరు ఊహిస్తారు. కానీ, ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లో ఇలాంటి సంఘటనే జరిగింది. డిసెంబర్ 03న ఆర్తీ దేవి అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు అమన్ని స్కూల్కి వెళ్లేందుకు నిద్రలేపింది. కానీ సదరు యువకుడు మానసిక స్థితి బాగా లేదు. తన తల్లిపై కోపంతో బలంగా నేలకోసి కొట్టడంతో తలకు బలమైన గాయం తగిలి మరణించింది. -
Human Brain: మానవ మెదడులో ‘‘బ్లాక్ బాక్స్’’.. ఇక్కడే జ్ఞాపకాలు పదిలం..
Human Brain: చిన్నతనంలో మనం మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన క్షణాలు, వారి చెప్పిన కథలు, వారి ఇంట్లో నడయాడిన ప్రాంతాలు, ఆటలు, పాటలు ఎంత కాలమైన మన మెదుడులోని గుర్తుండిపోతాయి. కొన్నేళ్లకు తర్వాత కూడా ఆ జ్ఞాపకాలు అంతే కొత్తగా మనకు కనిపిస్తుంటాయి. అయితే, ఇవన్నీ మన మెదడులో ఎక్కడ స్టోర్ అవుతాయనేది ఇప్పటికీ మిస్టరీనే. -
Bangladesh: బెదిరింపులతో బంగ్లా నుంచి భారత్ పారిపోయి వచ్చిన హిందూ బాలిక..
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై అకృత్యాలు ఆడగం లేదు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థను టార్గెట్ చేస్తు్న్నారు. ఇప్పటికే ఈ సంస్థలో సంబంధం ఉన్న ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ని, మరికొందరు హిందూ మత గురువుల్ని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. చిన్మోయ్ తరుపున వాదించే లాయర్లను కూడా అక్కడి ఇస్లామిస్ట్ రాడికల్స్ బెదిరిస్తు్న్నారు. -
Skoda Kylaq: బుకింగ్స్లో దూసుకుపోతున్న ‘‘కైలాక్’’.. బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, సోనెట్లో కలవరం..
Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్ని తీసుకువచ్చింది. -
Tata Motors: మారుతీ సుజుకీ, హ్యుందాయ్ దారిలో టాటా మోటార్స్.. జనవరి నుంచి ధరలు పెంపు..
Tata Motors: భారత ఆటోమేకర్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా హ్యుందాయ్, మారుతీ సుజుకీ దారినే అనుసరిస్తోంది. తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. పెరిగిన ధరలు 2025 జనవరి నుంచి అమలులోకి వస్తాయని చెప్పింది. తాజా ప్రకటన ప్రకారం.. తన మోడల్, వేరియంట్ల ఆధారంగా 3 శాతం వరకు పెంచనున్నారు. పెట్రోల్, డిజిల్ వాహనాల(ఐసీఈ)తో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) వాహనాలకు ధరల పెరుగుదల వర్తిస్తుంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా ధరల్ని పెంచుతున్నట్లు చెప్పింది. -
Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
Supreme Court: ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఈ పిటిషన్ పరిష్కరించే వరకు కొత్తగా ఎలాంటి పిటిషన్లు స్వీకరించొద్దని సూచించింది. మందిర్-మసీద్ వివాదాల్లో ఎలాంటి సర్వేలను అనుమతించమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు మతపరమైన స్వభావాన్ని నిర్ణయించేందుకు ఎలాంటి ఆదేశాలు, సర్వేలు జారీ చేయవద్దని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. -
Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది. -
Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
Bashar al-Assad: సిరియాలో బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 5 దశాబ్ధాలుగా ఆ దేశంలో అస్సాద్ కుటుంబ పాలన ముగిసింది. ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్(హెచ్టీఎస్) తిరుగుబాటుదారులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 15 ఏళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడింది. ఇదిలా ఉంటే, బషర్ ఫ్యామిలీలో సహా అతను కూడా రష్యాకు పారిపోయాడు. ఇన్నాళ్లు బషర్కి అండగా ఉన్న ఇరాన్, రష్యాలు తిరుగుబాటుదారుల ముందు తలవంచాయి. -
Parliament: పార్లమెంట్లో ఏం జరగబోతోంది..? ఎంపీలకు ‘‘ త్రీ లైన్ విప్’’ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్..
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది. -
LAC Border truce: చైనా ఫారెన్ మినిస్టర్తో భేటీ కానున్న అజిత్ దోవల్.. సరిహద్దులపై చర్చ..
LAC Border truce: 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇటీవల ‘‘లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ)’’ వెంబడి దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాలు సరిహద్దు సంధిని కుదుర్చుకున్నాయి. లఢక్ ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్న ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం వెనక్కి వెళ్లేందుకు అంగీకరించాయి.
తాజావార్తలు
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా?.. కేంద్రానికి CJP డెడ్లైన్.. ఢిల్లీలో హై అలర్ట్!
-
Viswanath And Sons: సూర్య సినిమాకు జ్యోతిక టచ్.. రిలీజ్ తర్వాతే ఆ సీక్రెట్ రివీల్!
-
ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు ‘అన్ కలెక్టబుల్’గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
-
Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్పై నర్సు సంచలన ఆరోపణ
-
Travis Head: విరాట్తో గొడవపై తొలిసారి స్పందించిన ట్రావిస్ హెడ్.. అసలు నిజం ఇదే!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!