Candy Crush: “క్యాండీ క్రష్” గేమ్కి బానిసైన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. ఎలా తెలిసిందంటే..
- ‘క్యాండీ క్రష్’ గేమ్కి బానిసైన ఉపాధ్యాయుడు..
- కలెక్టర్ పాఠశాల సందర్శించిన సమయంలో వెలుగులోకి..
- ఫోన్ పరిశీలించగా.. స్కూల్ టైమ్లోనే ఆట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Candy Crush: ఉత్తర్ ప్రదేశ్కి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ‘‘క్యాండీ క్రష్’’ మొబైల్ గేమ్కి బానిసగా మారాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా అదే పనిగా తన ఫోన్లో గేమ్ ఆడుతున్నట్లు విచారణలో తేలింది. డ్యూటీ సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజేంద్ర పన్సియా పాఠశాలను సందర్శించిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా పాఠశాలను తనిఖీ చేసిన సమయంలో విద్యార్థుల పుస్తకాల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చాలా తప్పుల్ని గుర్తించారు. దీంతో లోతుగా విచారించగా క్యాండీ క్రష్ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: BMW Hit-And-Run: యాక్సిడెంట్కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్షా..
Also Read
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
ఉపాధ్యాయుడి ఫోన్ తనిఖీ చేయగా, అందులోని ఒక ఫీచర్ అతను ఏఏ యాప్స్ని ఎక్కువగా వాడుతున్నాడనే విషయాన్ని వెల్లడించింది. క్యాండీ క్రష్ గేమ్ కోసం గంటల తరబడి సమయాన్ని వెచ్చించినట్లు తేలింది. పాఠశాల విధుల సమయంలో క్యాండీ క్రష్ ఆడటానికి దాదాపు రెండు గంటలు గడిపినట్లు తేలింది. ‘‘ఉపాధ్యాయులు విద్యార్థుల క్లాస్వర్క్ మరియు హోంవర్క్లను తనిఖీ చేయడంపై దృష్టి పెట్టాలి మరియు వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలి. అలాగే, మొబైల్ ఫోన్లను ఉపయోగించడం సమస్య కాదు, కానీ పాఠశాల సమయంలో వ్యక్తిగత కారణాల కోసం వాటిని ఉపయోగించడం సరికాదు’’ అని కలెక్టర్ చెప్పారు.
కలెక్టర్ పన్సియా ఆరుగురు విద్యార్థుల కాపీలను చెక్ చేగా, 95 తప్పుల్ని గుర్తించారు, వీటిలో 9 తప్పులు మొదటి పేజీలోనే ఉన్నాయి. దీంతో అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్ అసిస్టెంట్ టీచర్ ప్రియమ్ గోయల్ ఫోన్ తనిఖీ చేశారు. టీచర్ ఫోన్లోని వెల్బీయింగ్ ఫీచర్ ద్వారా ఐదున్నర గంటల పాఠశాల విధుల్లో ప్రియమ్ గోయల్ రెండు గంటల పాటు క్యాండీ క్రష్, 26 నిమిషాలు ఫోన్లో మాట్లాడటం, 30 నిమిషాలు సోషల్ మీడియాను ఉపయోగించినట్లు తేలింది. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్ర విద్యాశాఖకు సమచారం అందించడంతో, వారు అతడిని సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్లోనే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయండి!
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..