BMW Hit-And-Run: యాక్సిడెంట్కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్షా..
- సంచలనంగా మారిన ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు..
- యాక్సిడెంట్కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW Hit-And-Run: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసుల సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో నిందితుడు మిహిర్ షా కారును వేగంగా నడిపి కావేరీ నక్వా అనే 45 ఏళ్ల మహిళ మరణానికి కారణమయ్యారు. చేపల వ్యాపారి అయిన కావేరీ తన భర్తతో కలిసి స్కూటర్పై వస్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి బాధితురాలని 1.5 కి.మీ ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఈ వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడి తండ్రి అధికార శివసేన పార్టీకి పాల్ఘర్ జిల్లా డిప్యూటీ చీఫ్గా ఉన్నారు. అయితే, ఈ వ్యవహారంలో శివసేన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Read Also: Shaheen Afridi-PCB: చిక్కుల్లో పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిది!
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
24 ఏళ్ల మిహిర్ షా తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానిక బార్లో 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగినట్లు పోలీసులు తెలిపారు. విపరీతంగా మద్యం తాగి కారు నడిపిన మిహిర్, తన కారు కింద బాధితురాలి శరీరం చిక్కుకున్నదనే విషయం తెలసి కూడా అలాగే డ్రైవ్ చేసినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. స్థానికులు అరుస్తున్నప్పటికీ అతను పట్టించుకోలేదని చెప్పారు. మిహిర్ మరియు అతని డ్రైవర్ రాజర్షి బిదావత్ కొంత దూరంలో కారు ఆపి మృతదేహాన్ని పారేసే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలను మార్చడానికి ప్రయత్నించారు.ఈ ఘటనలో 72 గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అయితే, విచారణ సమయంలో తాను యాక్సిడెంట్ చేసినట్లు అంగీకరించినప్పటికీ, మద్యం సేవించినట్లు అంగీకరించలేదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో ప్రోటోకాల్ ప్రకారం తాగిన 12 గంటల్లో పరీక్షలు నిర్వహిస్తారు. నిందితుడు మూడు రోజుల తర్వాత అరెస్ట్ కావడంతో ఈ టెస్టులు పనికిరాకుండా పోయాయి. ముంబై మద్యపాన కనీస వయసు 25 ఏళ్లు గకాగా, నిందితుడికి 24 ఏళ్ల ఉన్నాయి. దీంతో బార్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మిహిర్ తనకు 27 ఏళ్లు అని తప్పుడు ఐడీ కార్డు చూపించినట్లు బార్ పేర్కొంది.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..