Venu Goapl Reddy
Author- NTV Telugu-
US-Iran: ట్రంప్ని చంపడానికి ప్రయత్నించబోం.. అమెరికాకు ఇరాన్ హామీ..
US-Iran: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని చంపే ప్రయత్నం చేయబోమని ఇరాన్ గత నెలలో అమెరికాకు తెలియజేసినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారులు ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్తో పంచుకన్నారు. అక్టోబర్ 14న ఇరాన్ ఈ మేరకు అమెరికకు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ట్రంప్కి వ్యతిరేకంగా ఏదైనా బెదిరింపులు యూఎస్ జాతీయ భద్రతకు సంబంధించిన అత్యున్నత ఆందోళన అని బైడెన్ ప్రభుత్వం ఇరాన్కి స్పష్టం చేసిందని, అలాంటి ఏ చర్యనైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని యూఎస్ అధికారులు తెలిపారు. -
Donald Trump: బంగ్లాదేశ్పై ఆంక్షలు విధించాలి.. ట్రంప్ని కోరనున్న భారత అమెరికన్లు..
Donald Trump: హిందువులతో పాటు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని, యూఎస్ కాంగ్రెస్ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు. -
PM Modi: జీ -20 సమ్మిట్ కోసం బయలుదేరిన ప్రధాని మోడీ..మూడు దేశాల్లో పర్యటన..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బ్రెజిల్లో జరిగే జీ-20 సమ్మిట్ కోసం బయలుదేరారు. బ్రెజిల్ సహా గయానా, నైజీరియా దేశాల్లో పర్యటించనున్నారు. గతేడాది జీ-20 సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియాలోలో పర్యటించబోతున్నారు. -
Crime: రోడ్డు పక్కన సూట్కేస్లో మహిళ మృతదేహం..
Crime: ఉత్తర్ ప్రదేశ్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. హాపూర్ జిల్లాలో ఢిల్లీ-లక్నో హైవేపై ఈ రోజు ఎర్రటి సూట్కేస్ కనిపించింది. అనుమానం రావడంతో సూట్కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో మహిళ డెడ్బాడీ ఉంది. ముందుగా ఈ సూట్కేస్ని రోడ్డుపై ప్రయాణికులు గమనించినట్లు పోలీసులు తెలిపారు. -
Karnataka: తల్లికూతుళ్లు వ్యభిచారం చేస్తున్నారని.. బయటకీడ్చి కొట్టారు..
Karnataka: తల్లికూతుళ్లు ఇద్దరు వ్యభిచారం చేస్తు్న్నారని ఆగ్రహించిన ఇరుగుపొరుగు వారిపై దారుణంగా ప్రవర్తించారు. ఇద్దరిని ఇంటిని నుంచి బయటకులాగి కొట్టారు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. వ్యభిచార రాకెట్ నడుపుతున్నారని ఆరోపిస్తూ.. 60,29 ఏళ్ల వయసు కలిగిన తల్లికూతుళ్లతపై దాడి చేశారు. వారి బట్టలు చింపేసి దారుణంగా కొట్టారని పోలీసులు తెలిపారు. -
Bengaluru: రైడ్ క్యాన్సిల్.. ఆటో డ్రైవర్, యువతి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్..
Bengaluru: ఒక యువతి, ఆటో డ్రైవర్కి జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు యువతి ఒకేసారి రెండు ఆటోలను బుక్ చేసి, చివరి నిమిషంలో ఒక దానిని క్యాన్సిల్ చేసినట్లు ఆటో డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన బెంగళూర్లో జరిగింది. అయితే, తాను బుక్ చేయలేదని యువతి, ఆటో డ్రైవర్ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ఇద్దరి మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒకానొక సమయంలో యువతి ఆవేశంతో ఆటో డ్రైవర్ని దుర్భాషలాడింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆటో డ్రైవర్ తన… -
Rahul Gandhi: అమరావతిలో రాహుల్ గాంధీ బ్యాగ్స్ చెక్ చేసిన ఈసీ..
Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగుల్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల కీలక నేతల లగేజీ చెక్ చేస్తున్నారు. తాజాగా శనివారం, మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగుల్ని ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. ఇండియా కూటమి నేతల్ని మాత్రమే ఈసీ టార్గెట్ చేస్తుందనే ఆరోపణల నేపథ్యంలో ఈ చెకింగ్ జరిగాయి. -
Bigg Boss 18: బిగ్ బాస్ ఆఫర్ని తిరస్కరించిన పీఎం మోడీ మాజీ బాడీగార్డ్..
Bigg Boss 18: ప్రధాని నరేంద్రమోడీ మాజీ బాడీగార్డ్ లక్కీ బిష్త్ బిగ్ తాను బిగ్ బాస్ 18 ఆఫర్ తిరస్కరించినట్లు చెప్పారు. మాజీ ‘‘రా’’ ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో లక్కీ బిష్త్ పొల్గొనాలని ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. ఒకప్పుడు బిష్త్ ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేశారు. -
Mutton Curry: మటన్ ముక్కల కోసం కొట్లాట.. బీజేపీ ఎంపీ విందులో ఘటన..
Mutton Curry: మటన్ ముక్కుల కొట్లాటకు దారి తీసింది. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్లో బీజేపీ ఎంపీ వినోద్ బింద్ ఏర్పాటు చేసిన విందులో ఈ గలాటా జరిగింది. నవంబర్ 14న జరిగిన ఈ విందు కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. వెయ్యి మందికి పైగా ఆహ్వానించినప్పటికీ, హాజరైన వారు కేవలం గ్రేవీని మాత్రమే వడ్డించడం చూసి ఆశ్చర్యపోయారు. మటన్ ముక్కలు లేకుండా గ్రేవీ మాత్రమే వడ్డించడంపై అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Pakistan: పాకిస్తాన్ ఎయిర్ లైనర్ PIAని కొనే దిక్కే లేదు..
Pakistan: పాకిస్తాన్తో పాటు దాని జాతీయ విమానయాన సంస్థ ‘‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(PIA)’’ కూడా తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో PIAని విక్రయించాలని చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అయితే, దీనిని కొనుగోలు చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో