Phone Tapping Case : హరీష్రావు విచారణపై సిట్ కీలక ప్రకటన
- ఇవాళ జరిగిన హరీష్రావు విచారణపై సిట్ ప్రకటన
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తి
- పంజాగుట్ట పీఎస్ క్రైం నెం. 243/2024 కేసులో విచారణ
- కుమారుడి ఫ్లైట్ కారణంగా ముందస్తుగా విచారణ ముగింపు
- సాక్షులను సంప్రదించొద్దని హరీష్రావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. -సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో (పంజాగుట్ట PS క్రైం నెం. 243/2024) మాజీ మంత్రి హరీష్రావు విచారణ పూర్తయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే, ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్ అధికారులు వివరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.
Ratha Saptami 2026: ఈ ఏడాది రథ సప్తమి తేదీ – పూజా విధానం, సంప్రదాయాలు ఇలా..!
Also Read
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Harish Rao : సీఎం రేవంత్కు బీఆర్ఎస్ భయం పట్టుకుంది.. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్
- Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
విచారణ ముగిసిన తర్వాత హరీష్రావుకు సిట్ అధికారులు కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని హరీష్రావును ఆదేశించారు. విచారణ ప్రక్రియలో లేదా దర్యాప్తులో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అవసరాల దృష్ట్యా అవసరమైతే ఆయనను మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు.
హరీష్రావు విచారణ విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ వస్తున్న వార్తలపై సిట్ ఘాటుగా స్పందించింది. తాము ఎక్కడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని, చట్టప్రకారమే విచారణ సాగిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో లేదా ఇతర మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
-
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!