Phone Tapping Case : హరీష్రావు విచారణపై సిట్ కీలక ప్రకటన
- ఇవాళ జరిగిన హరీష్రావు విచారణపై సిట్ ప్రకటన
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తి
- పంజాగుట్ట పీఎస్ క్రైం నెం. 243/2024 కేసులో విచారణ
- కుమారుడి ఫ్లైట్ కారణంగా ముందస్తుగా విచారణ ముగింపు
- సాక్షులను సంప్రదించొద్దని హరీష్రావుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. -సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో (పంజాగుట్ట PS క్రైం నెం. 243/2024) మాజీ మంత్రి హరీష్రావు విచారణ పూర్తయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే, ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్ అధికారులు వివరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు.
Ratha Saptami 2026: ఈ ఏడాది రథ సప్తమి తేదీ – పూజా విధానం, సంప్రదాయాలు ఇలా..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
విచారణ ముగిసిన తర్వాత హరీష్రావుకు సిట్ అధికారులు కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని హరీష్రావును ఆదేశించారు. విచారణ ప్రక్రియలో లేదా దర్యాప్తులో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అవసరాల దృష్ట్యా అవసరమైతే ఆయనను మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు.
హరీష్రావు విచారణ విషయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ వస్తున్న వార్తలపై సిట్ ఘాటుగా స్పందించింది. తాము ఎక్కడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని, చట్టప్రకారమే విచారణ సాగిందని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసు విషయంలో సోషల్ మీడియాలో లేదా ఇతర మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!