Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Anti Constitution Siddaramaiah On Governors Prosecution Sanction

CM Siddaramaiah: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ముడా స్కామ్‌పై కర్ణాటక సీఎం..

Published Date :August 17, 2024 , 4:09 pm
By Venu Goapl Reddy
  • ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..
  • ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశం..
  • ఇదంతా బీజేపీ కుట్రగా సీఎం ఆరోపణలు..
  • తాను తప్పు చేయలేదని.. తన ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నాని ఆరో్పణ..
CM Siddaramaiah: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ముడా స్కామ్‌పై కర్ణాటక సీఎం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Siddaramaiah: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కాములో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్కామ్‌లపై విచారణకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారియి. మైసూర్ నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం సేకరించిన భూమిలో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన భూమి ఉండటం, వారికే ఎక్కువ లబ్ధి జరిగేలా చూడటం వంటి ఆరోపణలు ఈ స్కాముతో ముడిపడి ఉన్నాయి. ముడా భూ కుంభకోణం కేసులో ప్రదీప్ కుమార్, టిజె అబ్రహం మరియు స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు పిటిషన్ దాఖలు చేయడంతో, గవర్నర్ గెహ్లాట్ విచారణకు ఆమోదం తెలిపారు.

ఈ కేసులో గవర్నర్, సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఓకే చెప్పడం సంచలనంగా మారింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి అన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని చెప్పారు. దీనిని కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. మొత్తం బినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంతా నా వెంటే ఉన్నారని సీఎం చెప్పారు. బీజేపీ, జేడీఎస్‌లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read Also: Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్‌పూర్‌లో మతహింస..

ముడా స్కీమ్ ద్వారా 50:50 పథకాన్ని తీసుకువచ్చారు. ఎవరైతే తమ భూములను ప్రభుత్వానికి అందిస్తే, దానిని డెవలప్‌చేసి అందులో సగం భూమిని భూమి ఇచ్చిన వారికి ఇవ్వాలన్నదే పథకం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఎకరం భూమని ప్రభుత్వానికి ఇస్తే అందులో 50 శాతం అంటే అర ఎకరం భూమని భూమిని కోల్పోయిన వారికి ఇవ్వాలి. వారు దానిని మార్కెట్ రేటు ప్రకారం అమ్ముకోవచ్చు. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి చెందిన మైసూరు పరిసరాల్లో 3 ఎకరాల 16 గంటల భూమిని నగర అభివృద్ధి కోసం అప్పగించింది. సేకరించిన భూమిలో ఏర్పాటు చేసిన లేఅవుట్ల లోనే ఆమెకు సైట్లు కేటాయించాలి, కానీ దీనికి బదులుగా నగరంలోని అత్యంత విలువైన 14 ప్రత్యామ్నాయ స్థలాల కేటాయించడం వివాదాస్పదమైంది. ఇది చట్టవిరుద్ధమని, దీని వల్ల ఖజానాకు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని లోకాయుక్త పోలీసులకు జూలైలో దాఖలు చేసిన ఫిర్యాదులో అబ్రహం ఆరోపించారు. ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారుల పేర్లు ఉన్నాయి.

తన భార్య పరిహారం పొందిన భూమిని ఆమె సోదరుడు మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చారని సిద్ధరామయ్య వాదించారు. అయితే మల్లికార్జున 2004లో అక్రమంగా సేకరించారని, ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కార్యకర్త కృష్ణ ఆరోపించారు. భూమిని 1998లో కొనుగోలు చేసినట్లు చూపించారని ఆరోపించారని ఆరోపించారు. 2014లో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్వతి ఈ భూమికి పరిహారం ఇవ్వాలని కోరారు.

ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయింది. ఈ రోజు సాయంత్రం బెంగళూర్‌లో కేబినెట్ అత్యవసర సమావేశం జరగబోతోంది. రాజ్ భవన్‌ని రాజకీయాలకు కేంద్రంగా మార్చారంటూ కాంగ్రెస్ దుయ్యబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఛీప్ మల్లికార్జున ఖర్గే అత్యవసరంగా బెంగళూర్ బయలుదేరారు. మరోవైపు ఈ సీఎంపై కుట్ర అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • CM SIDDARAMAIAH
  • congress
  • karnataka
  • muda scam

తాజావార్తలు

  • Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

  • 627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions