Pakistan: సిక్కు మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్.. 9 నెలల తర్వాత రక్షించిన పోలీసులు..
- పాకిస్తాన్లో మైనారిటీలకు రక్షణ ఏది.?
- తొమ్మిది నెలల క్రితం సిక్కు మహిళ కిడ్నాప్..
- ఇద్దరు నిందితుల అత్యాచారం..
- ఎట్టకేలకు రక్షించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది. అయితే, ఆ దేశంలో మాత్రం హిందువులు, సిక్కులు, క్రిస్టియన్ మైనారిటీపై దాడులు, మైనారిటీ మహిళలు, బాలికల కిడ్నాప్లు, అత్యాచారాలు జరుగుతున్నాయి. హిందూ బాలికలు, యువతను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మారుస్తున్నారు.
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుకి చెందిన సిక్కు మహిళను తొమ్మిది నెలల క్రితం కిడ్నాప్ చేశారు. 40 ఏళ్ల మహిళతో పాటు ఆమె మైనర్ కుమారుడిని ఇద్దరు నిందితులు అపహరించారు. తాజాగా ఆమెను, కుమారుడిని రక్షించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. లాహోర్కి 130 కి.మీ దూరంలోని పంజాబ్లోని ఫైపలాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- Emmanuel Macron: భారత్ ఆవిష్కరణల దేశం.. మేక్ ఇన్ ఇండియాకు మా పూర్తి గౌరవం: మాక్రాన్
- War Effect: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఒమన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన 13 భారతీయ నౌకలు...
- PoK: ఆక్రమిత కాశ్మీర్ను ‘‘పంజాబ్’’గా మారుస్తున్న పాకిస్తాన్..
Read Also: Bengal Governor: “నిందితుడిని ఉరితీసి, తర్వాత విచారించాలా.?” మమతా బెనర్జీపై గవర్నర్ ఫైర్..
బెండర్-బేస్డ్ వయొలెన్స్ యూనిట్ హెడ్(ఫైసలాబాద్) ఏఎస్పీ జైనాబ్ ఖలీద్ ప్రకారం.. నన్కానా సాహిబ్లో నివసిస్తున్న సిక్కు మహిళను ఫైసలాబాద్కి చెందిన ఖుర్రం షాజాద్, కిజార్ షాజాద్ అనే ఇద్దరు సోదరులు కిడ్నాప్ చేశారు. 9 నెలలుగా ఆమెపై పదేపదే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడాకులు తీసుకున్న మహిళని నన్కానా సాహిబ్కి చెందిన సైమా అనే స్నేహితురాలు నిందితుడు ఖుర్రంకి పరిచయం చేసినట్లు పోలీసులు తెలిపారు.
గతేడాది డిసెంబర్లో ఆమె తన మైనర్ కుమారుడిని ఫైసలాబాద్ నుంచి నాన్కానా సాహిబ్లోని తన సోదరి ఇంట్లో దిపాలని నిందితుడు ఖుర్రంని కోరింది. అయితే, బాలుడిని బందీగా పట్టుకుని అతను సోహైలాబాద్లోని తన ఇంటికి రావాలని మహిళని బలవంతం చేశాడు. అక్కడ నిందితులిద్దరూ మహిళను బంధించి అత్యాచారం చేశారు. తొమ్మిది నెలల నుంచి ఇద్దరు ఆమెపై పదే పదే అత్యాచారాని ఒడిగట్టినట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఆమె బంధువు ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 14న ఖుర్రం ఇంటిపై దాడి చేసి ఆమెను, ఆమె కొడుకుని రక్షించారు. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారాన్ని ప్రతిఘటించిన సమయంలో తనపై దాడి చేసినట్లు సిక్కు మహిళ చెప్పింది.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!