Bulldozer action: ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
- మత ఘర్షణలతో అట్టుడుకుతున్న ఉదయ్పూర్..
- ఓ వర్గం విద్యార్థి మరో వర్గం విద్యార్థిపై దాడి చేయడంతో ఉద్రిక్తత..
- నిందితుడి అక్రమ ఇంటిని కూల్చివేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bulldozer action: రాజస్థాన్ ఉదయ్పూర్ నగరం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 తరగతి విద్యార్థి, తన సహవిద్యార్థిపై కత్తితో దాడి చేయడం నగరంలో ఉద్రిక్తలకు దారి తీసింది. దాడి చేసిన బాలుడు మైనారిటీ వర్గాని చెందడం, గాయపడిన బాలుడు మెజారిటీ వర్గానికి చెందడంతో నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పలు హిందూ సంస్థలు మధుబనిలో ఆందోళన నిర్వహించాయి. ఈ ఘటన తర్వాత మత ఉద్రిక్తల్ని పెంచింది. ఈ ఘటనలో పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పటించడంతో పాటు షాపింగ్ మాల్స్పై రాళ్లతో దాడి చేశారు.
Read Also: CM Chandrababu: కాసేపట్లో ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ..
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ఇదిలా ఉంటే, ఉదయ్పూర్లో దాడికి పాల్పడిన బాలుడి కుటుంబం అక్రమంగా నిర్మించిన ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న అధికారులు బుల్డోజర్ యాక్షన్ చేపట్టారు. దాడికి పాల్పడిన బాలుడి కుటుంబం ఇళ్లు అటవీ భూముల్లో అక్రమంగా నిర్మించినట్లు తేలింది. జిల్లా యంత్రాంగం నిందితుడి కుటుంబానికి చెందిన వస్తువుల్ని తీసుకున్న తర్వాత కూల్చివేత మొదలుపెట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్ కొనసాగేలా చూసేందుకు ఘటనా స్థలంలో భారీ పోలీస్ బందోబస్తుని మోహరించారు. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పలువురు స్థానికులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
నిందితుడు శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో తోటి విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఇది మధుబన్ ప్రాంతంలో మత ఉద్రిక్తతలకు కారణమైంది. దాడి చేసిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనధికార నిర్మాణాలపై స్థానిక పరిపాలన అధికారులు దృఢమైన వైఖరితో పాటు పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించే ఘటనపై చర్యల్ని హైలెట్ చేస్తోంది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య నగరంలో పోలీస్ బందోబస్తుని పెంచారు. 144 సెక్షన్ విధించడమే కాకుండా, ఒక రోజు పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?