UP Crime: దేశంలో ప్రతీ రోజు ఎక్కడో ఓ చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కఠినమైన అత్యాచార చట్టాలు, నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నప్పటికీ కామాంధుల్లో భయం కలగడం లేదు. ఇటీవల కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. నిందితుడిని వెంటనే శిక్షించాలని ప్రజలు ఆందోళనలు చేశారు. మహిళల రక్షణకు మరింత కఠినమైన చట్టాలు రావాలని కోరారు.
MG Astor 2025:బ్రిటీష కార్ మేకర్ మోరిస్ గ్యారేజ్(MG) సరికొత్త అవతార్తో తన ‘‘ఆస్టర్’’ కారుని తీసుకురాబోతోంది. హైబ్రిడ్ కారుగా రాబోతోంది. మరిన్ని ఫీచర్లు, రివైజ్డ్ లుక్స్తో ZSని గ్లోబల్ మార్కెట్ ప్రవేశపెట్టనున్నారు. భారత్లో దీనిని ఆస్టర్ అని పిలుస్తారు.
Bangladesh: బంగ్లాదేశ్ పరిస్థితులు, ఉద్రిక్తతలు భారత వస్త్ర వ్యాపారం, పత్తి ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్స్టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ కేంద్రంగా ఉంది. అయితే, ఇటీవల హింసాత్మక అల్లర్లు, రాజకీయ అస్థిరత అక్కడి పరిశ్రమపై ప్రభావం చూపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే కొత్త ఆర్డర్లను నిలిపేసినట్లు తెలుస్తోంది.
Shreya Ghoshal: ప్రముఖ గాయని, జాతీయ అవార్డు విన్నర్ శ్రేయా ఘోషల్ కోల్కతాలో సెప్టెంబర్ 14న జరగాల్సిన తన కచేరిని వాయిదా వేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కోల్కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనతో యావత్ దేశం అట్టుడికింది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ డాక్టర్ల, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాల్ వ్యాప్తంగా ఇప్పటికీ నిరసలు వెల్లువెత్తుతున్నాయి.
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 8-10 తేదీల మధ్య ఆయన యూఎస్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ, డల్లాస్లలోని టెక్సాస్ యూనివర్సిటీ సహా పలువురుని కలవనున్నారు. జూన్ నెలలో లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లబోతున్నారు.
Kolkata rape-murder case: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నిందితుడిని వెంటనే శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు సంజయ్ రాయ్ని ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది.
Maharashtra: అతివేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే మహరాష్ట్రాలోని కొల్హాపూర్లో జరిగింది.
Pakistan: సాక్ష్యాత్తు అమెరికా అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ దేశ విదేశాంగ శాఖ, పెంటగాన్ పాకిస్తాన్తో అటంకాగుతోందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (మాజీ) హెచ్ఆర్ మెక్మాస్టర్ చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాకిస్తాన్కి సహాయం ఆపేయాలని ఆయన చెప్పినప్పటికీ విదేశాంగ శాఖ,
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు.