Maharashtra: ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లిన పోలీసులకు షాక్..
- ఇంట్లో నుంచి దుర్వాసన.. లోపలికి వెళ్లి చూడగా షాక్..
- వృద్ధ దంపతులు.. వారి కుమార్తె అస్థిపంజరాలు లభ్యం..
- ఎలా మరణించారన్నది ఇప్పటికీ సస్పెన్స్..
- దర్యాప్తు చేసున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంటిలో వృద్ధ దంపతులు, వారి 35 ఏళ్ల కుమార్తె శవాలు పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరాలుగా మారిన స్థితిలో కనుగొనబడ్డాయి. ముగ్గురి అస్థిపంజరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. జిల్లాలోని వాడా తాహసీల్లోని నెహ్రోలి గ్రామంలో శుక్రవారం వీటిని గుర్తించారు.
Read Also: Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
లోపల నుంచి లాక్ చేయబడిన ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక నివాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వాడా పోలీస్ స్టేషన్ అధికారి దత్తా కింద్రే తెలిపారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లగా, డ్రాయింగ్ రూపంలో ఇద్దరు మహిళల అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. బాత్రూంలో పురుషుడి అస్థిపంజరం కనిపించింది. ఈ అవశేషాలు 70 ఏళ్ల వృద్ధుడివి, అతని 65 ఏళ్ల భార్య మరియు 35 ఏళ్ల వారి కుమార్తెగా అనుమానిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ముగ్గురు ఎలా మరణించారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద హత్య, సమాచారాన్ని దాచడం మరియు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. వృద్ధ దంపతులు వారి వికలాంగురాలైన కుమార్తెతో అక్కడ నివసిస్తున్నట్లు తేలింది. వీరి ఇద్దరు కుమారులు జిల్లాలోని వాసాయిలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. అస్థిపంజరాల అవశేషాలు బయటపడటంతో గ్రామస్తుల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
తాజావార్తలు
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!