Mohanlal: లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
- లైంగిక వేధింపులపై హేమా కమిటీ రిపోర్టుని స్వాగతించిన మోహన్ లాల్..
- బాధ్యులు శిక్షించబడతారని హామీ..
- ప్రభుత్వ నిర్ణయంపై హర్షం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohanlal: మలయాళ ఫిలిం ఇండస్ట్రీ ‘‘మాలీవుడ్’’లో హేమా కమిటి రిపోర్టు సంచలనంగా మారింది. కేరళ ఫిలిం ఇండస్ట్రీలో మహిళా నటులపై లైంగిక వేధింపులు, అడ్వాన్సులు, కమిట్మెంట్ వంటి అంశాలను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత పలువరు స్టార్ యాక్టర్లపై మహిళా నటీమణులు, హీరోయిన్ల సంచలన ఆరోపణలు చేశారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో స్టార్ యాక్టర్ జయసూర్యతో పాటు ఎం ముఖేష్ వంటి వారు ఉన్నారు. మాలీవుడ్లో జరుగుతున్న భయంకరమైన లైంగిక వేధింపుల గురించి ప్రస్తుతం పెద్ద చర్చనే నడుస్తోంది. ఈ లైంగిక ఆరోపణల కేసుల్ని విచారించేందుకు కేరళ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీరిద్దరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆరోపణలు చేసిన మహిళా యాక్టర్లలో మిను మునీర్, బెంగాలీ నటి శ్రీ లేఖ మిత్ర, సోనియా మల్హర్ వంటి వారు ఉన్నారు.
Read Also: 20 Trains Cancelled: భారీ వర్షాల ఎఫెక్ట్.. విజయవాడ నుంచి వెళ్లే 20 రైళ్లు రద్దు..
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇదిలా ఉంటే, తాజాగా హేమా కమిటీ నివేదికను మలయాళ స్టార్ హీరో, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ స్వాగతించారు. వరసగా మలయాళ నటులపై వస్తున్న లైంగిక ఆరోపణలతో ఇండస్ట్రీ టాప్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ మలమాళం మూవీ ఆర్టిస్ట్స్(అమ్మ)ని రద్దు చేస్తూ, దాని చీఫ్ అయిన మోహన్ లాల్ నిర్ణయం తీసుకున్నారు. మలయాళంలో ప్రముఖ నటులైన జయసూర్య, సిద్ధిక్, చిత్ర నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ వంటి వారిపై ఆరోపణలు వచ్చాయి. ‘‘హేమా కమిటీ నివేదికను మేము స్వాగతిస్తున్నాము. ఆ నివేదికను విడుదల చేయడం ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయం. అన్ని ప్రశ్నలకు అమ్మ సమాధానం ఇవ్వదు. ఈ ప్రశ్నలు అందరి నుండి అడగాలి. ఇది చాలా కష్టపడి పనిచేసే పరిశ్రమ. చాలా మంది ఇందులో పాల్గొంటారు. అయితే దీనికి బాధ్యులు శిక్షించబడతారు, దర్యాప్తు జరుగుతోంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!