Waqf bill: వక్ఫ్ (సవరణ) బిల్లుని పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షల ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో వరసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశాయి.
India-Canada Ties: ఇండియా కెనడా మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా దౌత్య సంబంధాలు దిగజారాయి. ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మ, మరికొందరు దౌత్యవేత్తలు ‘‘ఆసక్తి గత వ్యక్తులు’’ అంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో ఒక్కసారిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Crime: గుజరాత్లోని కచ్లో దారుణం జరిగింది. 27 ఏళ్ల వివాహిత, తన ప్రియుడితో పారిపోయేందుకు వేసిన ప్లాన్ వృద్ధుడి మరణానికి కారణమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నానని కుటుంబసభ్యులను భ్రమింపచేయాలని వృద్ధుడిని ఈ జంట హత్య చేసి, దహనం చేసింది. నిజానికి చనిపోయిన వ్యక్తి అసలు ఎవరో వీరిద్దరికి తెలియదని, పారిపోతున్న క్రమంలో ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఈ హత్యకు బాధ్యత ప్రకటించింది. సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీంకి మద్దతుగా ఉండటంతోనే హత్య చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పతనమయ్యాయని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ హత్యని తామే చేసినట్లు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ మొత్తం ఘటన బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్తో ముడిపడి ఉంది. సల్మాన్ ఖాన్కి ఎవరైనా సాయం చేస్తే,వారికి సిద్ధిక్ గతి పడుతుందని హెచ్చరించింది.
Haryana Elections: హర్యానాలో కాంగ్రెస్కి రైతులు ‘‘అనుకూల వాతావరణాన్ని’’ సృష్టించారని, అయితే దానిని విజయంగా మార్చడంలో ఆ పార్టీ విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి ఆదివారం అన్నారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడాని టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. ‘‘హుడా కాంగ్రెస్ ఓడిపోవడానికి అతిపెద్ద కారణం..అతను ఎవరితో కాంప్రమైస్ కాలేకపోయాడు. పార్టీ అన్ని బాధ్యతలు అతడి పైనే ఉంచింది’’ అని అన్నారు.
BJP: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని ‘‘టెర్రరిస్ట్’’ అని పిలవడంపై వివాదం మొదలైంది. సీఎం వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘‘ ఆయనకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం’’ అని అన్నారు. దీనికి ముందు ఆదివారం సిద్ధరాయమ్య హుబ్బల్లి అల్లర్లలో నిందితులైన మైనారిటీ వ్యక్తులపై కేసులు విత్ డ్రా అంశంపై మాట్లాడారు.
Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్మోర్, మనోహర్ యాదవ్లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు.
Salman Khan: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడు జీషాన్ సిద్ధిక్ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిక్ని కాల్చి చంపారు.
Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి.