Gauri Lankesh murder: గౌరీ లంకేష్ హత్యా నిందితులకు హిందూ అనుకూల సంఘాల నుంచి ఘనస్వాగతం..
- గౌరీ లంకేష్ హత్య నిందితులకు ఘన స్వాగతం..
- హిందూ గ్రూప్ ఆధ్వర్యంలో సన్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gauri Lankesh murder: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యా నిందితులకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు వ్యక్తులు అక్టోబర్ 09న ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలయ్యారు. వీరికి హిందూ అనుకూల సంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఆరేళ్ల జైలు జీవితం గడిపిన పరశురాం వాఘ్మోర్, మనోహర్ యాదవ్లకు బెంగళూర్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 11న పరప్పన అగ్రహార జైలు నుంచి వీరిద్దరు విడుదలయ్యారు.
కర్ణాటకలోని విజయపురలోని స్వగ్రామానికి తిరిగి వచ్చిన వారికి హిందూ అనుకూల మద్దతుదారులు పూలమాలలు వేసి, కాషాయ శాలువాలతో సత్కరించారు. నినాదాలతో స్వాగతం పలికారు. వారిద్దరిని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు తీసుకెళ్లి, పూలమాల వేశారు. అనంతరం కాళికా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. నిందితుల మద్దతుదారులు మాట్లాడుతూ.. వారిని తప్పుగా జైలులో పెట్టారని పేర్కొన్నారు.
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
Read Also: Salman Khan: సిద్ధిక్ హత్యతో సల్మాన్ ఖాన్కు నిద్ర పట్టడం లేదు.. అన్ని మీటింగ్స్ రద్దు..
వాఘ్మోర్, యాదవ్లతో పాటు అమోల్ కాలే, రాజేష్ డి బంగేరా, వాసుదేశ్ సూర్యవంశీ, రుషీకేష్ దేవదేకర్, గణేష్ మిస్కిన్, అమిత్ రామచంద్ర బడ్డీలకు అక్టోబర్ 09న బెయిల్ మంజూరైంది. ప్రోహిందూ లీడర్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు విజయదశమి, మాకు ముఖ్యమైన రోజు. గౌరీ లంకేష్ హత్యకు సంబంధించిన ఆరోపణలపై ఆరేళ్లుగా అన్యాయంగా జైలులో ఉన్న పరశురామ్ వాఘ్మోర్, మనోహర్ యాదవ్లను మేము స్వాగతిస్తున్నాము. అసలు నేరస్థులు ఇంకా కనుగొనబడలేదు, కానీ ఈ వ్యక్తులు కేవలం హిందూ అనుకూలులుగా ఉన్నందుకు వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ అన్యాయానికి తీవ్రమైన ఆత్మపరిశీలన అవసరం.’’ అని అన్నారు.
వామపక్ష భావాలు ఉన్న జర్నలిస్ట్ గౌరీ లంకేష్, హిందుత్వ భావజాలానికి బద్ధవ్యతిరేకిగా ప్రసిద్ధి చెందారు. సెప్టెంబర్ 05, 2017న బెంగళూర్లో ఆమె ఇంటి వెలుపల ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఆమెను కాల్చి చంపారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. డిసెంబర్ 2023లో గౌరీలంకేష్ హత్య కేసు విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు.
తాజావార్తలు
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?