Waqf bill: వక్ఫ్ బిల్లు ప్యానెల్ సమావేశంలో వాగ్వాదం.. మహిళలకు చోటుపై ప్రతిపక్షాల అభ్యంతరం..
- వక్ఫ్ బిల్లు ప్యానెల్ సమావేశంలో వివాదం..
- బీజేపీ ఎంపీలు.. ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం..
- బోర్డులో మహిళలకు చోటు కల్పించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf bill: వక్ఫ్ (సవరణ) బిల్లుని పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షల ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో వరసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశాయి.
వక్ఫ్ బోర్డుల్లో మహిళలను చేర్చే ప్రతిపాదనపై బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, దిలీప్ సైకియా, అభిజిత్ గంగూలీ, తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్కు చెందిన గౌరవ్ గొగోయ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కమిటీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదని, బీజేపీ ఎంపీలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు చైర్పర్సన్ని దుర్భాషలాడుతున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- CM Vijay: సీఎం విజయ్కు హైకోర్టు షాక్.. మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Read Also: India-Canada Ties: ఖలిస్తానీ సిక్కుల మద్దతు కోసమే ట్రూడో ప్లాన్.. అందుకే భారత్తో దౌత్యయుద్ధం..
వక్ఫ్ భూముల కుంభకోణాల్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రమేయం ఉందని కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్వర్ మణిప్పాడి ఆరోపించడంతో ప్రతిపక్షాలు సోమవారం వాకౌట్ చేశాయి. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఎంపీలు ఈ ప్యానెల్ సమావేశాల్లో ఉన్నతమైన వ్యక్తులపై నిరూపించబడని ఆరోపణలు చేయరాదని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ నిషికాంద్ దూబే జేపీసీ చైర్పర్సన్ జగదాంబికా పాల్కి లేఖ శారు. దీంట్లో వక్ఫ్ బిల్లుపై వచ్చిన భారీ 1.25 కోట్ల సబ్మిషన్లపై తీవ్రమైన ఆందోళన లేవనెత్తారు.కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా దర్యాప్తు చేయాలని కోరారు. ఛాందసవాద గ్రూపులు, జకీర్ నాయక్ వంటి వ్యక్తులు లేదా ‘‘విదేశీ శక్తుల’’ ప్రమేయం ఉందొచ్చని దూబే ఆరోపించారు.
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం పింఛన్.. స్మార్ట్ పెన్షన్ ప్లాన్ పూర్తి వివరాలు
-
Mysuru Horror: ఘోర విషాదం.. భార్య, ఇద్దరు కుమార్తెలను హత్య చేసి భర్త ఆత్మహత్య
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!