Siddique Murder Case: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిద్ధిక్ హత్య కేసు విచారణ: సీఎం షిండే..
- మహారాష్ట్రలో సంచలనంగా మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య..
- విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే సిద్ధిక్ హత్య కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ ఘటనపై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ విచారణ జరుపుతారని ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాలని ముంబై పోలీసులను ఆదేశించామని, గ్యాంగ్ వార్ పుంజుకోవద్దని ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
Read Also: Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
బాంద్రాలోని ఖేత్ వాడి జంక్షన్లో శనివారం రాత్రి వీధిలైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చీకటిలోనే మాజీ మంత్రి సిద్ధిక్పై కాల్పులు జరిగాయి. మూడు బుల్లెట్లు బాబా సిద్ధిక్ ఛాతిలోకి దూసుకెల్లాయి. ఒక బుల్లెట్ అతనితో పాటు కారులో ఉన్న వ్యక్తి కాలికి తగిలింది. బాబా సిద్ధిక్ కారు బుల్లెట్ ఫ్రూవ్ అయినప్పటికీ బుల్లెట్స్ అద్దం గుండా ప్రవేశించాయి. దీంతో దాడి కోసం అత్యాధునిక పిస్టల్స్ వాడి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.
పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు 13 రౌండ్ల 9.9 ఎంఎం డిటాచబుల్ మ్యాగజైన్తో ఉన్న పిస్టల్ని స్వాధీనం చేసుకున్నారు. బాబా సిద్ధిక్ తన కుమారుడు జీషన్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడి జరిగింది. దసరా రోజున అమ్మవారి ఉరేగింపు ఈ ప్రాంతంగా వెళ్తు్ండగా, పెద్ద ఎత్తున సంగీతం, క్రాకర్స్, బాణాసంచా శబ్ధాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు సిద్ధిక్పై కాల్పులు జరిపారు. రెండు వారాల క్రితమే సిద్ధిక్కి హత్యా బెదిరింపులు రావడంతో పోలీసులు ఆయనకు వై-కేటగరి సెక్యూరిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!