Siddique Murder Case: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సిద్ధిక్ హత్య కేసు విచారణ: సీఎం షిండే..
- మహారాష్ట్రలో సంచలనంగా మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య..
- విచారణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న సీఎం షిండే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddique Murder Case: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత బాబా సిద్ధిక్ హత్య కేసు మహారాష్ట్రలో సంచలనంగా మారింది. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి ఆఫీస్ వద్ద బాబా సిద్ధిక్పై ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధిక్ మరణించారు. ఈ దాడికి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. నిందితుల్లో ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు అధికార బీజేపీ కూటమిని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే సిద్ధిక్ హత్య కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ ఘటనపై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ విచారణ జరుపుతారని ప్రకటించారు. శాంతిభద్రతలను కాపాలని ముంబై పోలీసులను ఆదేశించామని, గ్యాంగ్ వార్ పుంజుకోవద్దని ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
Read Also: Hamas: ఇరాన్ , హిజ్బుల్లా మద్దతు కోసం అక్టోబర్ 07 దాడి ఆలస్యం.. 9/11 తరహా దాడులకు ముందుగా ప్లాన్..
బాంద్రాలోని ఖేత్ వాడి జంక్షన్లో శనివారం రాత్రి వీధిలైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో చీకటిలోనే మాజీ మంత్రి సిద్ధిక్పై కాల్పులు జరిగాయి. మూడు బుల్లెట్లు బాబా సిద్ధిక్ ఛాతిలోకి దూసుకెల్లాయి. ఒక బుల్లెట్ అతనితో పాటు కారులో ఉన్న వ్యక్తి కాలికి తగిలింది. బాబా సిద్ధిక్ కారు బుల్లెట్ ఫ్రూవ్ అయినప్పటికీ బుల్లెట్స్ అద్దం గుండా ప్రవేశించాయి. దీంతో దాడి కోసం అత్యాధునిక పిస్టల్స్ వాడి ఉంటారని పోలీసు వర్గాలు తెలిపాయి.
పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు 13 రౌండ్ల 9.9 ఎంఎం డిటాచబుల్ మ్యాగజైన్తో ఉన్న పిస్టల్ని స్వాధీనం చేసుకున్నారు. బాబా సిద్ధిక్ తన కుమారుడు జీషన్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడి జరిగింది. దసరా రోజున అమ్మవారి ఉరేగింపు ఈ ప్రాంతంగా వెళ్తు్ండగా, పెద్ద ఎత్తున సంగీతం, క్రాకర్స్, బాణాసంచా శబ్ధాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు సిద్ధిక్పై కాల్పులు జరిపారు. రెండు వారాల క్రితమే సిద్ధిక్కి హత్యా బెదిరింపులు రావడంతో పోలీసులు ఆయనకు వై-కేటగరి సెక్యూరిటీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!