CM Chandrababu: ముగిసిన దావోస్ పర్యటన.. రేపు ఏపీకి సీఎం చంద్రబాబు..
- దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వస్తున్న ఏపీ సీఎం..
- రేపు ఉదయం 11: 30కి అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు..
- దావోస్ పర్యటనలో 2. 50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బయల్దేరారు. రేపు ( జనవరి 23న) ఉదయం 8.25 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. మొత్తంగా నాలుగు రోజుల దావోస్ పర్యటనలో 36కు పైగా కార్యక్రమాలకు సీఎం హాజరయ్యారు. ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతో 3 సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు.. ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదిక వద్ద ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అర్వింద్ కృష్ణ సహా 16 దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో నిర్వహించిన 9కి పైగా సెషన్స్, సమావేశాల్లో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచి ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగ పోకడలు, పారిశ్రామిక వేత్తల ఆలోచనలు తెలుసుకునేందుకు ఉపకరించాయని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Read Also: Puppy Abuse Case: అరే ఏంట్రా ఈ దారుణం.. రెండు నెలల కుక్కపై యువకుడు లైంగిక దాడి..
Also Read
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
అయితే, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పాలసీలను అంచనా వేసేందుకు కూడా సదస్సు దోహదం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2025 దావోస్ పర్యటన ద్వారా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారం అయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరిగిన సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం లాంటి రంగాల్లో ఏపీ సాధిస్తున్న విజయాలను వనరుల్ని సమర్ధంగా వివరించామని పేర్కొన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్ వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. యువ శక్తి, సమర్థ నాయకత్వం, పాలసీల కారణంగా ప్రస్తుతం ప్రతీ రంగంలో భారత్ లో కంపెనీలకు అవకాశాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Read Also: Vijayasai Reddy: లిక్కర్ స్కాం గురించి జగన్కి తెలియదు.. విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఇక, యూరప్ లోని తెలుగు ప్రజలతో మమేకం అవుతూ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో చంద్రబాబు ఆత్మవిశ్వాసం నింపారు. ఇక, దావోస్ వేదికగా జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులకూ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే, రేపు ఉదయం 8.25 గంటలకు హైదరాబాద్ చేరుకుని.. అక్కడి నుంచి అమరావతికి బయల్దేరనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి అమరావతి సచివాలయంలో అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు.
తాజావార్తలు
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!