Baba Siddique murder: బాబా సిద్ధిక్ హత్య కేసులో ట్విస్ట్.. నిందితుల్లో ఒకరికి ‘‘బోన్ అసిఫికేషన్ టెస్ట్’’
- బాబా సిద్ధిక్ హత్యలో ట్విస్ట్..
- తాను మైనర్ అని పేర్కొన్న ఒక నిందితుడు..
- బోన్ టెస్టుకు ఆదేశాలు ఇచ్చిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Siddique murder: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఈ హత్యకు బాధ్యత ప్రకటించింది. సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీంకి మద్దతుగా ఉండటంతోనే హత్య చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ హత్యపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ప్రభుత్వమే లక్ష్యంగా కాంగ్రెస్, ఇతర పార్టీలు విరుచుపడుతున్నాయి. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పతనమయ్యాయని విమర్శిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుల్లో ఒకరైన ధరమ్ రాజేష్ కశ్యప్ తాను మైనర్ని అని, తన వయసు 17 ఏళ్లు అని పేర్కొన్నాడు. కానీ దీనిని ప్రాసిక్యూషన్ తోసిపుచ్చుతూ.. అతను 2003లో జన్మించాని కోర్టు వెల్లడించారు. మరో నిందితుడు గుర్మైల్ సింగ్(24)కి కోర్టు 14 రోజుల కస్టడీ విధించింది. ఇద్దరు నిందితులను ఆదివారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ధరమ్ రాజేష్ సింగ్ తాను మైనర్ అని పేర్కొనడంతో అతడిని వయసుని నిర్ధారించేందుకు ‘‘బోన్ అసిఫికేషన్’’ టెస్ట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. శరీరంలోని కొన్ని ఎముకల ఎక్స్-రేని పరిశీలించడం ద్వారా వ్యక్తి వయసుని అంచనా వేయడాన్ని బోన్ అసిఫికేషన్ టెస్ట్గా చెబుతారు. ఈ టెస్ట్ ద్వారా కశ్యప్ వయసుని నిర్ధారించనున్నారు.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
అయితే, కోర్టులో విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ గౌతమ్ గైక్వాడ్ దీనిని వ్యతిరేకించారు. శనివారం రాత్రి కాల్పులు జరిగిన ప్రాంతంలో నిందితుడి ఆధార్ కార్డ్ని స్వాధీనం చేసుకున్నారని, అందులో కశ్యప్ మార్చి 1, 2003లో జన్మించినట్లు చూపిస్తుందని అన్నారు. నిందితుడి ఆధార్ కార్డును అందచేయాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ కార్డులో కశ్యప్ ఫోటో ఉందని, అయితే పేరు రంజన్ కుమార్ గుప్తాగా ఉందని చెప్పారు. కశ్యప్ ఆధార్ కార్డ్ తనదేనా అని తెలిపేందుకు అతడి బొటన వేలి ముద్రని తీసుకోవాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. కశ్యప్ వయసుని రుజువు చేసేందుకు ముంబై పోలీసులు సంబంధిత పత్రాలతను కోర్టుకు తీసుకురావాలని మెజిస్ట్రేట్ కోరారు.
Read Also: Maoist Party: ఛత్తీస్గఢ్ ఎన్కౌటర్పై మావోయిస్ట్ పార్టీ కీలక ప్రకటన.. బలగాలపై ఆరోపణలు
ఇద్దరు నిందితుల తరుపున వాదిస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ వాదిస్తూ.. కశ్యప్ తాను మైనర్ని అని తనకు ఆదేశాలు ఉన్నాయని, ప్రాసిక్యూషన్ వద్ద అతని వయసు నిరూపించేందుకు పత్రాలు ఉంటే, అతను దీనిపై సమస్య లేవనెత్తడని చెప్పారు. నిందితుడి వద్ద ఎటువంటి జనన ధృవీకరణ పత్రం లేదా అతని వయస్సును ధృవీకరించడానికి పాఠశాల విడిచిపెట్టిన ధృవీకరణ పత్రం లేదని, కశ్యప్ ఎముక ఆసిఫికేషన్ పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పారు.
కాల్పులకు సంబంధించి నిందితులు ఎక్కడ శిక్షణ పొందారు..? కేసు దర్యాప్తు చేయడానికి కాకుండా తదుపరి నేరాలను అడ్డుకోవడాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏదైనా రాజకీయ శత్రుత్వంతో నేరం జరిగిందా..? అని విచారణ చేయాలని ప్రాసిక్యూషన్ గైక్వాడ్ కోర్టులో వాదించారు. శివకుమార్తో సహా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, మరోకరు ముగ్గురు ప్రధాన నిందితులకు లాజిస్టిక్ సపోర్ట్ అందించారని ఆయన తెలిపారు. నిందితుల తరుపు అడ్వకేట్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఘటనలో నిందితులు నిజంగా నేరం చేశారా..? లేదా అని తేల్చాలని అన్నారు. మరణించిన వ్యక్తి ప్రముఖ రాజకీయ నాయకుడు, మరొకరు దీనిని చేసి ఉండొచ్చని, నిందితులను ఇరికిస్తున్నారని అగర్వాల్ వాదించారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!