Venu Goapl Reddy
Author- NTV Telugu-
Ranya Rao Case: నన్ను ట్రాప్ చేశారు, విచారణలో విలపించిన రన్యా రావు..
Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్లో కన్నడ నటి రన్యా రావు చిక్కడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బెంగళూర్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 12 కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్ఐ అధికారులు రన్యా రావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్రారావు కూతురు కూడా కావడంతో రన్యా రావు వ్యవహారం ఒక్కసారిగా వార్తాంశంగా నిలిచింది. దుబాయ్ నుంచి బెంగళూర్ వచ్చిన రన్యా రావు బంగారు కబడ్డీలను దాచిని బెల్ట్ని శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్… -
China: ‘‘డ్రాగన్-ఏనుగు డ్యాన్స్’’.. మారిన చైనా స్వరం, భారత్కి స్నేహహస్తం..
China: డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో భారత్తో వైరం మంచిది కాదని చైనాకు అర్థమైనట్లు ఉంది. దీంతో భారత్కి స్నేహం హస్తం అందిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, కలిసి ఎదుగుదామంటూ కామెంట్స్ చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్, చైనా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-బీజింగ్ కలిసి పనిచేయాలని, ఆధిపత్యం, పవర్ పాలిటిక్స్ని వ్యతిరేకించి ముందగుడు వేయాలని పిలుపునిచ్చారు. -
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో కన్నీరు.. కారణం ఏంటంటే..
Justin Trudeau: కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో తన చివరి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన 9 ఏళ్ల పదవీకాలంలో గందరగోళ క్షణాలను, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన భారీ సుంకాలను చర్చిస్తూ కంట తడి పెట్టారు. ప్రజాదరణ రేటింగ్ తగ్గుతున్న నేపథ్యంలో ట్రూడో జనవరిలో తాను ప్రధాని పదవికి, పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కెనడియన్లకు మొదటి ప్రాధాన్యం ఉండాలనే తన నిబద్ధతను చెప్పారు. -
Wife harassment: భార్య, అత్త వేధింపులకు మరొకరు బలి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
Wife harassment: భార్య, భార్య తరుపు బంధువులు వేధింపులతో ఇటీవల కాలంలో పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా, ముంబైకి చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం సంచలనంగా మారింది. తన కంపెనీ వెబ్సైట్లో తన భార్య, అత్తలను నిందిస్తూ ఆయన సూసైడ్ నోట్ పోస్ట్ చేశారు. ముంబైలోని ఓ హోటల్ గదిలో 41 ఏళ్ల నిశాంత్ త్రిపాఠి ఆత్మహత్య చేసుకున్నాడు. గత శుక్రవారం సహారా హోటల్లోని తన గదిలో ఉరివేసుకుని మరణించాడు. -
Global Terrorism Index 2025: టెర్రరిజంలో రెండో స్థానంలో పాకిస్తాన్.. భారత్ స్థానం ఎంతంటే..
Global Terrorism Index 2025: పాకిస్తాన్ మరోసారి తనకు ‘‘టెర్రరిజం’’లో తిరుగు లేదని నిరూపించుకుంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్(GTI) -2025లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశం బుర్కినాఫాసో ఉండగా, మూడో స్థానంలో సిరియా ఉంది. పాక్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా అవతరించింది. ఉగ్రవాద దాడుల్లో భారీ పెరుగుదల, పౌరుల మరణాల సంఖ్య పెరగడం వలన పాక్ రెండో స్థానానికి చేరుకుంది. -
UP Police: ‘‘హోలీ ఏడాదికి ఒకసారి, శుక్రవారం నమాజ్ 52 సార్లు’’.. ఇబ్బంది ఉంటే ఇంట్లో ఉండండి..
UP Police: హోలీ పండగ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ ఒకే రోజు కలిసి రావడంతో మతపరమైన సున్నిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. గతేడాది నవంబర్ నెలలో సంభాల్ జామా మసీదు సర్వే సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో నలుగురు వ్యక్తులు మరణించడంతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి -
Crime: కాళ్లలో 10 మేకులు.. మహిళ మృతదేహం.. చేతబడి కారణమా..?
Crime: బీహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మహిళ పాదాల్లో 10 మేకులు పొడిచిన మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నలంద జిల్లాలో గురువారం నాడు పాదాల్లో 10 మేకులు గుచ్చబడిని స్థితిలో మహిళ శవం లభ్యమైంది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జిల్లాలోని చండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. -
Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..
Voyager: వయోజర్ 1, వయోజన్ 2.. ఈ రెండు స్పేస్ ప్రోబ్స్ ఇప్పటి వరకు మానవుడి ద్వారా నిర్మించబడి విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన అంతరిక్ష వస్తువులుగా రికార్డు సృష్టించాయి. సౌర వ్యవస్థను ఎప్పుడో దాటవేసిన ఇవి, ప్రస్తుతం ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ప్రయాణిస్తున్నాయి. సూర్యుడి రక్షణ బుడగను, ఆవల ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అయితే, వయోజర్ ప్రోబ్స్లో రెండు పరికరాలను నాసా నిలిపేయనుంది. దీని ద్వారా వాటిలో ఉన్న విద్యుత్ని ఆదా చేయాలని చూస్తోంది. -
Ranya Rao: ‘‘నా గుండె పగిలింది’’.. నటి రన్యారావు వ్యవహారంపై తండ్రి ఆవేదన..
Ranya Rao: కన్నడ నటి రన్యారావు అక్రమ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక డీజీపీ, కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి కె రామచంద్రరావు కుమార్తె కావడంతో ఈ వ్యవహారం మరింతగా వార్తల్లో నిలిచింది. తన కుమార్తె బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కావడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒక అధికారిగా కాకుండా ‘‘గుండె పగిలిన తండ్రి’’గా మాట్లాడుతూ, […] -
S Jaishankar: జై శంకర్ భద్రతా ఉల్లంఘన.. స్పందించిన యూకే..
S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం ఎదురైంది. ఖలిస్తానీ అనుకూల వర్గాలు జైశంకర్ వైపు దూసుకు రావడం సంచలనంగా మారింది. బుధవారం రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత మిస్టర్ జైశంకర్ చాథమ్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక ఖలిస్తానీ అనుకూల నిరసనకారుడు బారికేడ్లను దాటి, జైశంకర్ వైపుగా వచ్చి, భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!