Asaduddin Owaisi: ఢిల్లీ అల్లర్ల నిందితుడు అసెంబ్లీ బరిలో.. ఓవైసీ పార్టీ నుంచి పోటీ..
- ఢిల్లీ అల్లర్ నిందితుడికి అసెంబ్లీ టికెల్ ఇచ్చిన ఎంఐఎం..
- ఓవైసీ పార్టీ నుంచి తాహిర్ హుస్సేన్ పోటీ..
- ఈ చర్యను విమర్శించిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాబోయే ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ని నిలబెట్టింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడి ఉన్న హుస్సేన్ని ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కౌన్సిలర్గా ఉన్న తాహిర్ హుస్సేన్ని ఆప్ బహిష్కరించింది. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.
‘‘ఢిల్లీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఎంఐఎంలో చేరారు. రాబోయే ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో ముస్తాఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా అభ్యర్థిగా నిలబెడుతున్నాము. అతడి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఈ రోజు నన్ను కలుసుకుని పార్టీలో చేరారు’’ అని ఓవైసీ ధృవీకరించారు. 2020 ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుస్సేన్ నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటని..? బీజేపీ ప్రశ్నిస్తోంది.
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
Read Also: Best Yoga Poses: ఆడవారు రొమ్ము పరిమాణం పెంచుకోవడానికి యోగా ఆసనాలు వేస్తే సరి
బీజేపీ నేత కపిల్ మిశ్రా దీనిపై స్పందించారు. ‘‘అంకిత్ శర్మ హత్యకు కారణమైన వ్యక్తితో ఓవైసీ పొత్తు పెట్టుకున్నాడు. అతడి ఇంట్లో బాంబులు, రాళ్లు కనుగొబడ్డాయి. వందలాది మంది హిందువులనను చంపడానికి ప్రయత్నించాడు. ఢిల్లీలో తాహిర్ హుస్సేన్ పేరుతో ఢిల్లీలో మరోసారి అల్లర్లు జరిగితే, దాని పరిణామాలు అతడి ఏడు తరాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇతడిపై ఉన్న ఎఫ్ఐఆర్లను రద్దు చేసి ఉపశమనం కల్పించింది. ఫిబ్రవరి 27, 2020న తాహిర్ హుస్సేన్ భవనంలోని మొదటి అంతస్తు నుంచి అల్లర్లు, విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే ఘటనకు సంబంధించిన మరో కేసులో హుస్సేన్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కోర్టు తెలిపింది. ఫిబ్రవరి 24, 2020న జరిగిన ఇదే ఘటనకు సంబంధించి ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని కోర్టు గమనించింది. ప్రస్తుత ఎఫ్ఐఆర్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ అసలు కేసుకు అనుబంధంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసలో 53 మంది మరణించారు. దాదాపుగా 700 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!