Asaduddin Owaisi: ఢిల్లీ అల్లర్ల నిందితుడు అసెంబ్లీ బరిలో.. ఓవైసీ పార్టీ నుంచి పోటీ..
- ఢిల్లీ అల్లర్ నిందితుడికి అసెంబ్లీ టికెల్ ఇచ్చిన ఎంఐఎం..
- ఓవైసీ పార్టీ నుంచి తాహిర్ హుస్సేన్ పోటీ..
- ఈ చర్యను విమర్శించిన బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాబోయే ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ని నిలబెట్టింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడి ఉన్న హుస్సేన్ని ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కౌన్సిలర్గా ఉన్న తాహిర్ హుస్సేన్ని ఆప్ బహిష్కరించింది. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.
‘‘ఢిల్లీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఎంఐఎంలో చేరారు. రాబోయే ఢిల్లీ విధాన సభ ఎన్నికల్లో ముస్తాఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా అభ్యర్థిగా నిలబెడుతున్నాము. అతడి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఈ రోజు నన్ను కలుసుకుని పార్టీలో చేరారు’’ అని ఓవైసీ ధృవీకరించారు. 2020 ఢిల్లీ అల్లర్లలో తాహిర్ హుస్సేన్ నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటని..? బీజేపీ ప్రశ్నిస్తోంది.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Best Yoga Poses: ఆడవారు రొమ్ము పరిమాణం పెంచుకోవడానికి యోగా ఆసనాలు వేస్తే సరి
బీజేపీ నేత కపిల్ మిశ్రా దీనిపై స్పందించారు. ‘‘అంకిత్ శర్మ హత్యకు కారణమైన వ్యక్తితో ఓవైసీ పొత్తు పెట్టుకున్నాడు. అతడి ఇంట్లో బాంబులు, రాళ్లు కనుగొబడ్డాయి. వందలాది మంది హిందువులనను చంపడానికి ప్రయత్నించాడు. ఢిల్లీలో తాహిర్ హుస్సేన్ పేరుతో ఢిల్లీలో మరోసారి అల్లర్లు జరిగితే, దాని పరిణామాలు అతడి ఏడు తరాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇతడిపై ఉన్న ఎఫ్ఐఆర్లను రద్దు చేసి ఉపశమనం కల్పించింది. ఫిబ్రవరి 27, 2020న తాహిర్ హుస్సేన్ భవనంలోని మొదటి అంతస్తు నుంచి అల్లర్లు, విధ్వంసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే ఘటనకు సంబంధించిన మరో కేసులో హుస్సేన్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారని కోర్టు తెలిపింది. ఫిబ్రవరి 24, 2020న జరిగిన ఇదే ఘటనకు సంబంధించి ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని కోర్టు గమనించింది. ప్రస్తుత ఎఫ్ఐఆర్లో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ అసలు కేసుకు అనుబంధంగా పరిగణించబడుతుందని పేర్కొంది. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసలో 53 మంది మరణించారు. దాదాపుగా 700 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..