సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి లక్నో కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. వీర్ సావర్కర్పై కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పరువు నష్టం కేసులో జనవరి 10, 2025న హాజరుకావాలని ఆయనను కోర్టు ఆదేశించింది.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి సన్నిహితుడిగా భావించే మిఖాయిల్ షాట్స్కీ హత్య చేయబడ్డాడు. ఇతను రష్యన్ మిస్సైల్ డెవలపర్గా ఉన్న ఇతడిని మృతదేహాన్ని మాస్కోలో కనుగొన్నారు. కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఉపయోగించిన క్షిపణులను డెవలప్ చేసిన రష్యన్ కంపెనీ మార్స్ డిజైన్ బ్యూరో డిప్యూటీ జనరల్ డిజైనర్గా, సాఫ్ట్వేర్ అధిపతిగా షాట్స్కీ ఉన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనవరి 20,2025న ఆయన అధ్యక్ష బాధ్యతల్ని తీసుకోబోతున్నారు. అయితే, ఆయన పదవి చేపట్టే ముందే ఇప్పుడున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిహద్దు గోడకు సంబంధించిన సామాగ్రిని విక్రయిస్తున్నట్లు తెలిసింది.
RG Kar Case: కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్తో పాటు స్థానిక తలాపోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మోండల్కి సీల్దా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
Bengaluru: దంపతులకు సంబంధించి ఓ విచిత్రమైన కేసు కర్ణాటక హైకోర్టులో విచారణకు వచ్చింది. ‘‘తన భర్త తన కన్న పెంపుడు పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు’’ అంటూ భార్య కేసు పెట్టింది. సాధారణ వైవాహిక సమస్యగా ప్రారంభమైన ఈ వివాదం కోర్టుకు చేరింది. తన భర్త పిల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని, పిల్లి తనను రక్కిందని భార్య తన కేసులో పేర్కొంది.
Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని,
Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు.
Renukaswamy murder case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడలకు రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ మంజూరైంది. కర్ణాటక హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ఎస్ విశ్వజిత్ శెట్టి బెయిల్ పిటిషన్లను విచారించారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు నాగరాజు, అనుకుమార్, లక్ష్మణ్, జగదీష్ అలియాస్ జగ్గా, ఆర్ ప్రదూష్ రావులకు బెయిల్ మంజూరు చేసింది.
Donald Trump: వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. జనవరి 20, 2025లో అధికారం చేపట్టిన వెంటనే వలసదారుల్ని అమెరికా నుంచి పంపించేందుకు ప్లాన్ తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు అమెరికాలో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులపై పెను ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ‘‘డిపోర్టేషన్’’ చేస్తానని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.