Akhilesh Yadav: మసీదుల కింద దేవాలయాలను వెతికే వారు శాంతి కోరుకోరు..
- బీజేపీపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పరోక్ష విమర్శలు..
- మసీదుల కింద దేవాలయాలను వెతికే వారు శాంతిని కోరుకోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: మందిర్-మసీదు వివాదంలో సర్వేలను నిలిపేయాలని గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణ ముగిసే వరకు సర్వేలు నిలిపేయాలని కోరింది. ఈ ఆదేశాలు వచ్చిన ఒక రోజు తర్వాత సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: Minister Gottipaati: నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో అఖిలేష్ యాదవ్.. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జామా మసీదు సర్వేని గురించి ప్రస్తావించారు. సర్వే సమయంలో ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడటంతో హింస చెలరేగింది. దీంట్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. భారతీయ ఓటర్లను బీజేపీ ఎప్పుడూ గౌరవించదని, యూపీ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి అనుమతించలేదని, పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం దేశాన్ని సురక్షితంగా, ఐక్యంగా ఉంచిందని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని చెప్పారు. రాజ్యాంగంపై చర్చ నేపత్యంలో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భద్రత, ఆర్థిక వ్యవస్థ, పౌరుల అంతర్గత భద్రతపై సందేహాలు లేవనెత్తారు. చైనా ఆక్రమణని ప్రస్తావించారు. దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. కుల గణన కులాలా మధ్య అంతరాన్ని తొలగిస్తుందని, అవకాశం దొరికితే కుల గణన నిర్వహిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!