Akhilesh Yadav: మసీదుల కింద దేవాలయాలను వెతికే వారు శాంతి కోరుకోరు..
- బీజేపీపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పరోక్ష విమర్శలు..
- మసీదుల కింద దేవాలయాలను వెతికే వారు శాంతిని కోరుకోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: మందిర్-మసీదు వివాదంలో సర్వేలను నిలిపేయాలని గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో విచారణ ముగిసే వరకు సర్వేలు నిలిపేయాలని కోరింది. ఈ ఆదేశాలు వచ్చిన ఒక రోజు తర్వాత సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు లోక్సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మసీదుల కింద దేవాలయాల కోసం వెతికే వారు శాంతిని కోరుకోలేదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: Minister Gottipaati: నార్వే, బ్రిక్స్ దేశాల పారిశ్రామికవేత్తలతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ భేటీ
Also Read
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో అఖిలేష్ యాదవ్.. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ జామా మసీదు సర్వేని గురించి ప్రస్తావించారు. సర్వే సమయంలో ఓ గుంపు రాళ్లదాడికి పాల్పడటంతో హింస చెలరేగింది. దీంట్లో ఐదుగురు వ్యక్తులు మరణించారు. భారతీయ ఓటర్లను బీజేపీ ఎప్పుడూ గౌరవించదని, యూపీ ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఓటేయడానికి అనుమతించలేదని, పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.
రాజ్యాంగం దేశాన్ని సురక్షితంగా, ఐక్యంగా ఉంచిందని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఆత్మ వంటిదని చెప్పారు. రాజ్యాంగంపై చర్చ నేపత్యంలో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భద్రత, ఆర్థిక వ్యవస్థ, పౌరుల అంతర్గత భద్రతపై సందేహాలు లేవనెత్తారు. చైనా ఆక్రమణని ప్రస్తావించారు. దేశంలోని 20 కోట్ల మంది మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేందుకు ప్రయత్నిస్తు్న్నారని ఆరోపించారు. కుల గణన కులాలా మధ్య అంతరాన్ని తొలగిస్తుందని, అవకాశం దొరికితే కుల గణన నిర్వహిస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!