Venu Goapl Reddy
Author- NTV Telugu-
Annamalai: అన్నామలైపై క్రిమినల్ కేసు.. వివాదంగా పవన్ కళ్యాణ్ హాజరైన సభ..
Annamalai: ఇటీవల మధురై కేంద్రంగా మురుగన్ భక్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విద్వేష ప్రసంగాలు చేశారని బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు కే. అన్నామలైపై, హిందూ మున్నాని గ్రూపులోని ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వంజినాథన్ అనే న్యాయవాది ఆరోపించారు. -
Father: ఛీ వీడేం తండ్రి.. టైమ్కు నిద్ర పోవడంలేదని 5 ఏళ్ల కూతురుకు టార్చర్..
Father: కన్నకూతుకు ఇబ్బంది రాకుండా చూసుకునే తండ్రులు ఉంటారు, కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన 5 ఏళ్ల కూతురును చిత్రహింసలు పెట్టాడు. పాప సకాలంలో నిద్ర పోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్తో కాల్చడంతో పాటు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
Covid Vaccine: కోవిడ్ తర్వాత మరణాలకు వాక్సిన్లు కారణం కాదు.. తాజా అధ్యయనంలో వెల్లడి..
Covid Vaccine: కరోనా తర్వాత కొందరు అకస్మాత్తుగా మరణించిన ఘటనలు దేశంలో రికార్డ్ అయ్యాయి. అయితే, వ్యాక్సిన్ల వల్లే మరణాలు సంభవించాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), AIIMS నిర్వహించిన విస్తృతమైన అధ్యయనాలు చెక్ పెట్టాయి. కరోనా వ్యాక్సిన్లకు ఆకస్మిక అకాల మరణాలకు ఎలాంటి సంబంధాలు లేవని అధ్యయనం వెల్లడించింది. దేశంలో 40 ఏళ్ల లోపు పెద్దలకు గుండెపోటు పెరుగుతున్న నేపథ్యంలో ఈ స్టడీ వెలువడింది. -
Donald Trump: అతి తక్కువ సుంకాలతో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం..
Donald Trump: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు దగ్గరపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, భారత్-యూఎస్ త్వరలో ‘‘చాలా తక్కువ సుంకాలతో’’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. దీని వల్ల రెండు దేశాలు పోటీ పడుతాయని చెప్పారు. -
Quad: భారత్కు దౌత్య విజయం.. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన క్వాడ్ నేతలు..
Quad: భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం దక్కింది. క్వాడ్ గ్రూప్ (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్వాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రులు కోరారు. -
Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తొలి బృందం.. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు..
Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు. -
Donald Trump: 60 రోజుల గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది..
Donald Trump: హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. -
High Court: అమ్మాయికి ‘‘ఐ లవ్ యూ’’ చెప్పినంత మాత్రాన ‘‘లైంగిక’’ ఉద్దేశం ఉన్నట్లు కాదు..
High Court: 2015లో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో 25 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. బాలిక చేయి పట్టుకుని ‘‘ఐ లవ్ యూ’’ అని చెప్పినందుకు నాగ్పూర్ సెషన్స్ కోర్టు విధించిన 3 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు రద్దు చేసింది. నిందితుడి తరుపున కోర్టులో వాదించిన న్యాయవాది సోనాలి ఖోబ్రగడే సెషన్స్ కోర్టు తీర్పుపై అప్పీలు చేశారు. లైంగిక వేధింపులను నిరూపించేందుకు ఈ కేసులో […] -
India-US trade deal: అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్.. వాణిజ్య ఒప్పందంలో ప్రతిష్టంభన..
India-US trade deal: ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అమెరికాకు చెందిన నేతలు మాట్లాడుతూ.. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని చెబుతున్నారు. కానీ, పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా, కొన్ని రంగాల్లోకి అమెరికాను అనుమతించేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. ఇండియాపై ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గడం లేదు. దీంతో, పరస్పర సుంకాల అమలులోకి రావడానికి జూలై 09 తుది గడువుగా ఉన్నప్పటికీ, ఆలోపు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం కష్టంగానే కనిపిస్తోంది. -
MK Stalin: “పోలీసుల క్షమించరాని చర్య”.. లాకప్ డెత్ కేసు సీబీఐకి బదిలీ..
MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!