Bengaluru Techie Suicide Case: 3 రోజుల్లో రావాలి.. అతుల్ సుభాష్ భార్యకి పోలీస్ సమన్లు..
- బెంగళూర్ టెక్కీ సూసైడ్ కేసులో కీలక పరిణామం..
- అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియాకు పోలీసుల సమన్లు..
- 3 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. కొందరు మహిళలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని మిస్ యూజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
Read Also: Allu Arjun: స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్.. పోలీసుల రాకతో షాక్!
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇదిలా ఉంటే, ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్లోని జౌన్ పూర్లో ఉంటున్న అతుల్ భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబానికి బెంగళూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావడానికి వారికి 3 రోజుల సమయం ఇచ్చారు. బాధితుడు సుభాష్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు నలుగురు సభ్యులతో కూడిన బెంగళూర్ పోలీస్ టీం, యూపీ జౌన్పూర్లోని నిఖితా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఈ కేసులో అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, ఆమె సోదరుడు అనురాగ్ సింఘానియా, ఆమె మేనమామ సుశీల్ సింఘానియాలకు నోటీసులు జారీ చేశారు. ‘‘వాస్తవాలు, పరిస్థితుల్ని నిర్ధారించేందుకు మిమ్మల్ని విచారించడానికి కారణాలు ఉన్నాయి. 3 రోజుల్లోగా బెంగళూర్లోని దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.
బీహార్కి చెందిన 34 ఏళ్ల అతుల్ సుభాష్, యూపీ జౌన్పూర్కి చెందిన నికితా సింఘానియాని 2019లో పెళ్లి చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సుభాష్ బెంగళూర్లో నివాసం ఉంటున్నాడు. అతడికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. 2021లో నిఖితా, అతుల్ని కాదని పుట్టింటికి వెళ్లింది. అతడిపై వరకట్న వేధింపులు, గృహహింస సెక్షన్ల కింద కేసు పెట్టింది. నెలకు రూ. 2-4 లక్షల భరణాన్ని డిమాండ్ చేసింది. కేసును పరిష్కరించేందుకు రూ. 3 కోట్లు కావాలని నిఖితా కుటుంబం వేధించినట్లు అతుల్ ఆరోపించాడు. నిర్దోషినైనా తనకు కాకుండా న్యాయవ్యవస్థ ఆమెకే అండగా నిలిచిందని, చివకు జడ్జి కూడా కేసు సెటిల్మెంట్కి డబ్బులు అడిగినట్లు ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!