Atul Subhash Case: భార్యల వేధింపులు.. వరకట్నం చట్టం సెక్షన్ 498ఏ రివ్యూపై సుప్రీంకోర్టులో పిల్..
- భార్య వేధింపులు.. అతుల్ సుభాష్ కేస్..
- వరకట్న చట్టాలను సమీక్షించాలని సుప్రీంకోర్టులో పిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atul Subhash Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తప్పుడు వరకట్న వేధింపులు, గృహ హింస చట్టాలు సెక్షన్ 498-ఏ ని సమీక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు భర్త, అతడి ఫ్యామిలీని వేధించేందుకు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతున్నారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ డిమాండ్ వస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని, ఆయన భార్య నిఖితా సింఘానియాని అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ కేసు నేపత్యంలో తప్పుడు వరకట్నం, గృహ హింస చట్టాలపై సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలలైంది. చట్టాలను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, లాయర్లు, లీగర్ జూరిస్టులతో కమిటీ ఏర్పాటు చేయాలని లాయర్ విశాల్ తివారీ కోరారు.
Also Read
- Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
- Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
Read Also: Bengaluru Techie Suicide Case: 3 రోజుల్లో రావాలి.. అతుల్ సుభాష్ భార్యకి పోలీస్ సమన్లు..
“వరకట్న నిషేధ చట్టం మరియు IPC యొక్క సెక్షన్ 498A వరకట్న డిమాండ్లు మరియు వేధింపుల నుండి వివాహిత స్త్రీలను రక్షించడానికి ఉద్దేశించబడింది, అయితే మన దేశంలో ఈ చట్టాలు అనవసరమైన, చట్టవిరుద్ధమైన డిమాండ్లను పరిష్కరించడానికి భర్త, అతడి కుటుంబాన్ని అణిచివేసేందుకు ఆయుధాలుగా మారాయి.” అని పిటిషన్లో పేర్కొన్నారు. తప్పుడు వరకట్న కేసుల్లో పురుషుల్ని ఇరికించడం విషాదకరమైన ముగింపులకు దారి తీసిందని పిల్లో పేర్కొన్నారు.
ఈ చట్టాల ప్రకారం వివాహిత పురుషులపై ఈ తప్పుడు కేసుల కారణంగా, మహిళలపై జరుగుతున్న నిజమైన అణిచివేతను అనుమానాస్పదంగా చూడాల్సి వస్తోందని, ఇది ఒక్క అతుల్ సుభాష్ కేసు గురించి మాత్రమే కాదని, అనేక మంది భార్యలు వరకట్న చట్టాలను దుర్వినియోగం చేయడం వల్ల చాలా మంది బాధితులుగా ఉన్నారని, చట్టం ఉద్దేశం దెబ్బతింటుందని విశాల్ తివారీ పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Jihadi drug: భారత్లో తొలిసారి పట్టుబడ్డ ‘‘జిహాదీ డ్రగ్’’.. ఇది ఎంత ప్రమాదకరమంటే..
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..