Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
Pakistan: ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి ‘‘మధ్యవర్తి’’గా వ్యవహరించామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటోంది. తమ వల్లే యుద్ధం ఆగిందని సొంత దేశంలో భారీగా ప్రచారం చేసుకుంటుంది. పాకిస్తాన్ తనను తాను గొప్ప దౌత్యశక్తిగా ప్రదర్శించుకుంటోంది. అయితే, పాకిస్తాన్ గర్వాన్ని నేలకు దించుతూ సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘దౌత్య విజయం’’ పాకిస్తాన్కు అన్నం పెట్టదు అని ఆయన పేర్కొనడం పాకిస్తాన్ పరువును తీసేసింది. ఒక ప్రపంచ సదస్సులో మాట్లాడుతూ.. ఇరాన్ […] -
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
Ayatollah Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ ఫిబ్రవరి 28న జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంత్యక్రియలకు వీలు కలుగలేదు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ, యుద్ధం అసాధారణ పరిస్థితుల వల్ల అంత్యక్రియలు ఆలస్యమైనట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ.? […] -
Allahabad High Court: హలాలా, ట్రిపుల్ తలాక్ పేరుతో లైంగిక దోపిడీ.. హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
Allahabad High Court: నికాహ్, హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి పద్ధతులపై అలహాబాద్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పద్ధతుల ముసుగులో మహిళలపై జరిగే లైంగిక దోపిడీని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి పద్ధతులు సమాజపు ‘చీకటి అధ్యాయం’ అని, ఇవి రాజ్యాంగ విలువలకు, సమానత్వానికి, మానవ గౌరవానికి విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలు చట్టరీత్యా నేరాలు మాత్రమే కాకుండా, సమాజపు సామూహిక మనస్సాక్షిని కూడా కదిలిస్తాయని కోర్టు పేర్కొంది. జస్టిస్ జె.జె. […] -
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగుల సొమ్ము పేరుకుపోయి ఉంది. ఇన్యాక్టివ్ ఈపీఎఫ్ ఖాతాల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము వేల కోట్లలో ఉన్నట్లు తేలింది. సుమారుగా 31 లక్షల ఇన్యాక్టివ్ ఖాతాల్లో రూ. 9330 కోట్లకు పైగా ఉద్యోగుల సొమ్ము ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం కొత్త ఈపీఎఫ్ స్కీమ్ -2026ను అమలులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 31, 2026 నాటికి దేశవ్యాప్తంగా 30,91,862 ఇనాపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాలు […] -
Diabetes: షుగర్ కంట్రోల్కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
Diabetes: జీవనశైలి వ్యాధిగా మధుమేహం(షుగర్) వ్యాధి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తోంది. మరోవైపు, భారత్ ‘‘డయాబెటిక్ క్యాపిటల్’’గా మారుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్కు అలవాటు పడటం ఈ పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. షుగర్ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ, మన జీవనశైలి మార్పుతో షుగర్ లేకుండా జీవించవచ్చు. శారీరక శ్రమ, ప్రొటీన్, ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ, కార్బోహైడ్రేట్స్ను తక్కువగా తింటే షుగర్ లేకుండానే జీవితం గడపొచ్చు. అయితే, […] -
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
MEA: ఇటీవల పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని సింధ్ రేంజర్స్ స్థావరంపై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే, ఈ దాడి వెనక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. ఇతరుల వైపు వేలెత్తి చూపేటప్పుడు సొంత దేశంలో పనిచేస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు భారత్ సూచించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ […] -
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
Saudi Arabia: సౌదీ అరేబియాతో ఘోర ప్రమాదం జరిగింది. గల్ఫ్లో హార్ముజ్ జలసంధికి పశ్చిమాన ఉన్న రాస్ తానూరాలో ఆదివారం ఆయిల్ దిగ్గజం అరామ్కోకు చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది సౌదీ జాతీయులు మరణించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు నిర్ధారించడానికి సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు అరామ్కో వెల్లడించింది. గల్ఫ్ లోని రాస్ తానూరా టెర్మినల్లో శుక్రవారం అరామ్కో ముడి చమురు లోడింగ్ను పున:ప్రారంభించిన రెండు రోజుల […] -
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Ketan Agarwal Murder Case: పూణేకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్తో హత్య చేవారు. జూన్ 18న పూణేకు సమీపంలోని లోహగఢ్ కోటకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తోసేసి చంపారు. అయితే, ఈ కేసులో దొరకకుండా చేతన్ 10 గంటల 40 నిమిషాల పాటు మాస్టర్ ప్లాన్ చేశారు. ఇన్ని గంటల పాటు ‘‘డిజిటల్ బ్లాక్అవుట్’’ అమలు చేసిన […] -
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్లో శాంతిభద్రతల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేవారు. మొహర్రం సందర్భంగా ఇకపై వీధి అల్లర్లు జరగడం లేదని చెప్పారు. హత్రాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు కత్తులతో అల్లర్లు ప్రేరేపిస్తూ హంగామా చేసే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 2017 నుంచి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన అన్నారు. మెరుగైన భద్రతా వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన […] -
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
Iran: హార్ముజ్ జలసంధి త్వరలో తెరుచుకుంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందంలో ఇది కూడా భాగమే అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు. హార్ముజ్ జలసంధి రాబోయే 30 రోజుల్లో తిరిగి తెరుచుకుంటుందని, యుద్ధానికి ముందున్న స్థితికి వస్తుందని చెప్పారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఆ దేశ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో అరాఘ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్లో ఏర్పాటు చేసిన అడ్డంకుల్ని […]
తాజావార్తలు
-
Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
-
Nutrition Tips : అన్నంలో నెయ్యి.. ఆరోగ్య రహస్యం.!
-
IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?